టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందిన తమన్నా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్టు వెల్లడించారు.
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పటికీ వైద్యులు కొన్ని రోజులు హోం క్వారంటైన్ లో ఉండాలని సూచనలు చేశారని.అందువల్ల షూటింగ్ లకు కొన్ని రోజుల పాటు దూరంగా ఉండబోతున్నానని తమన్నా తెలిపారు.
ట్విట్టర్ ఖాతా ద్వారా ఆరోగ్యం గురించి స్పందించిన తమన్నా పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్టు పేర్కొన్నారు.
తమన్నాకు కరోనా నిర్ధారణ కావడంతో ఆమె అభిమానులు కంగారు పడుతున్న సంగతి తెలిసిందే.
ఒక సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ కు వచ్చిన తమన్నాకు కరోనా నిర్ధారణ అయింది.తమన్నా ట్వీట్ లో ప్రపంచంలో ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయని తాను మాత్రం త్వరగానే కోలుకున్నానని వెల్లడించారు.
సినిమా సెట్ లో కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అయినప్పటికీ తాను వైరస్ బారిన పడ్డానని చెప్పారు.
మొదట స్వల్పంగా జ్వరం వచ్చిందని.
కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణ అయిందని చెప్పారు.కరోనా నుంచి తాను త్వరగా కోలుకోవాలని పూజలు చేసిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఆగష్టు నెలాఖరులో తమన్నా తల్లిదండ్రులకు సైతం కరోనా నిర్ధారణ అయింది.వాళ్లు కూడా వైరస్ నుంచి త్వరగానే కోలుకున్నారు.
ప్రస్తుతం తమన్నా చేతిలో మూడు సినిమాలు, ఒక వెబ్ సిరీస్ ఉన్నాయి.
తమన్నా ప్రధాన పాత్రలో నటించిన దట్ ఈజ్ మహాలక్ష్మి విడుదలకు సిద్ధంగా ఉంది.
తమన్నా ప్రస్తుతం సీటీమార్, అంధాధూన్, గుర్తుందా శీతాకాలం సినిమాల్లో నటిస్తున్నారు.అంధాధూన్ లో నెగిటివ్ పాత్రలో నటిస్తున్న తమన్నా ప్రస్తుతం అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ ఉండటం గమనార్హం.