తెలుగు సినీ ప్రేక్షకులకు నటి తనిష్క్ రాజన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదటి చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ కెరీర్ ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అంచలంచెలుగా ఎదుగుతూ సినిమాలలో హీరోయిన్ స్థాయికి చేరుకుంది.2017లో శరణం గచ్చామి అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.అంతేకాకుండా టీవీ రంగంలో ప్రకటనలు చేసే స్థాయి నుంచి సౌత్ ఇండియన్ సినిమాల్లో హీరోయిన్ గా నటించే స్థాయికి ఎదిగింది.
సినిమాలలో తన అందం నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది తనిష్క్ రాజన్.
ఇది ఇలా ఉంటే తనిష్క్ రాజన్ తాజాగా నటించిన చిత్రం నేనెవరో.
ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యింది ఈ ముద్దుగుమ్మ.కాగా డిసెంబర్ 2న ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సినిమాలతో పాటుగా ఈ ముద్దుగుమ్మ చేతిలో ఇంకా బోలెడు ప్రాజెక్టులు ఉన్నాయి.హిందీలో సినిమాలలో వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నట్లు ఆమె తెలిపింది.
ఇది ఇలా ఉంటే తనిష్క్ రాజన్ నటించిన దో లోగ్ అనే ప్రైవేట్ ఆల్బమ్ యూట్యూబ్ లో సంచలనంగా మారిన విషయం అందరికీ తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా నేనెవరో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె వాళ్ళ ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.సినిమా పరిశ్రమలో అవకాశాలు అందుకోవడం అన్నది అంత సులభమైన పని కాదు.కష్టపడి పని చేస్తే మనసుకు నచ్చిన పని చేస్తే మనల్ని ఏది అవలేదు.నేను దర్శకుడు ఏం చెబితే అది చేసే నటినే ఆయన విజన్ కు తగ్గట్టుగా నటించేందుకు ప్రయత్నిస్తాను.
నా ప్రయాణం ఇంకా మొదలవ్వలేదని నేను అనుకుంటున్నాను.అందుకే నేను ఇంకా కష్టపడి పని చేయాలనుకుంటున్నాను.
ప్రేక్షకులందరికీ ప్రేమను సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్నాను అని చెప్పుకొచ్చింది తనిష్క్ రాజన్.