లెజెండ్ , బ్యాక్ బెంచ్ స్టూడెంట్ , ఉషోదయం లాంటి సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాణి స్వాతి రెడ్డి ఇవాళ ఉదయం నుంచీ మాత్రం ఫుల్ గా ఫేమస్ అయిపొయింది.స్వాతి రెడ్డి తన తల్లి నాగేన్ద్రమ్మ తో గొడవ పడుతోంది విషయం ఏంటంటే గుంటూరు వ్యక్తి శ్రీనివాస్ తన కూతురుని కిడ్నాప్ చేసాడు అనేది ఆమె తల్లి పోలీసులకి ఇచ్చిన ఫిర్యాదు.
అదే సమయంలో తన తల్లి చేసిన ఫిర్యాదుకు కౌంటర్ గా నటి స్వాతి రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు.
తల్లి మీద ఫిర్యాదు చేశారు.
తానేమీ కిడ్నాప్ కు గురి కాలేదని.తాను శ్రీనివాస్ ను ప్రేమిస్తున్నానని.
తన ఇష్టంతోనే ఇంటి నుంచి వెళ్లిపోయినట్లుగా ఆమె స్పష్టం చేశారు.ఆర్ధికంగా తన కన్న తల్లితో ఇబ్బందులు ఉండడం వల్లనే ఇదంతా జరుగుతోంది అని తెలుస్తోంది.
పోలీస్ స్టేషన్ లో ఒకరి మీద ఒకరు కొట్టుకునేంత వరకూ వెళ్ళింది వ్యవహారం.ఈ మొత్తం వ్యవహారం వ్యక్తిగత అంశాలకు సంబంధించింది కావటంతో.
తల్లి కూతుళ్లకు బంజారాహిల్స్ పోలీసులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.అదే సమయంలో ఇద్దరి ఫిర్యాదుల ఆధారంగా కేసు దర్యాప్తును పోలీసులు షురూ చేశారు.