మన దేశంలో శరవేగంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి ప్రత్యక్షంగా ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంటే పరోక్షంగా ప్రజల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే.ది కపిల్ శర్మ షో ద్వారా గుర్తింపును సంపాదించుకున్న సుమోనా చక్రవర్తి తాజాగా సోషల్ మీడియా అభిమానులతో మాట్లాడుతూ సంచలన విషయాలను వెల్లడించారు.
పది సంవత్సరాల క్రితం నుంచి తాను గర్భాశయ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నానని ఆమె అన్నారు.
లాక్ డౌన్ లో తనకు ఏర్పడిన ఇబ్బందుల గురించి ఆ ఇబ్బందులను ఏ విధంగా అధిగమించాననే విషయాల గురించి సుమోనా చక్రవర్తి చెప్పుకొచ్చారు.
తన మాటల వల్ల కొందరిలోనైనా స్పూర్తి కలుగుతుందనే ఆలోచనతో ఈ విషయాలను వెల్లడిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.గత కొన్ని రోజులుగా తన చేతిలో ప్రాజెక్ట్స్ లేవని ఆమె అన్నారు.
నిరుద్యోగిగా మారడంతో తనపై తనకే కోపం వచ్చేదని ఆమె చెప్పుకొచ్చారు.అయితే తాను నిరుద్యోగినే అయినప్పటికీ తన కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నానని ఆమె పేర్కొన్నారు.
తాను ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధితో పది సంవత్సరాల నుంచి బాధ పడుతున్నానని ఇప్పటివరకు ఈ విషయం ఎవరికీ చెప్పలేదని ఆమె పేర్కొన్నారు.ప్రస్తుతం వ్యాధి నాలుగో స్టేజ్ లో ఉందని ఆమె వెల్లడించారు.
సెలబ్రిటీల జీవితాలు బాగుంటాయని అందరూ అనుకుంటారని కానీ తమకు కూడా చాలా సమస్యలు ఉంటాయని ఆమె అన్నారు.
మాకు ప్రేమ, దయ అవసరం అని ప్రేమ, దయ ఉంటే ఈ సమస్యలను అధిగమించడం సులువు అని సుమోనా వెల్లడించారు.
వ్యక్తిగత సమస్యల గురించి చెప్పడం సులువు కాదని కొంతమందిలోనైనా స్పూర్తి నింపాలనే ఆలోచనతో తాను ఈ విషయాలను వెల్లడిస్తున్నానని ఆమె అన్నారు.తాను తన కంఫర్ట్ జోన్ ను వదిలి ఈ విషయాలను వెల్లడిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.