తెలుగులో అమ్మ పాత్రలలో నటించి మంచి పాపులారిటీని సంపాదించుకున్న నటీమణులలో ఒకరైన సుధ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ40 సంవత్సరాలుగా సినిమాలలో తాను ఏడుస్తూనే ఉన్నానని తెలిపారు.షూటింగ్ లొకేషన్ లో నవ్వుతూ ఉండాలని అనుకుంటానని సుధ అన్నారు.
మేస్త్రి సినిమాలో తనను ఎంపిక చేసిన సమయంలో దాసరి నారాయణరావు గారు లీటర్ గ్లిజరిన్ రాయించారని సుధ తెలిపారు.
నేను నవ్వినా, ఏడ్చినా కన్నీళ్లు వస్తాయని ఆమె చెప్పుకొచ్చారు.
ప్రభుత్వం నుంచి తనకు పురస్కారాలు రాకపోయినా నేను బాధపడలేదని ఆమె అన్నారు.పదిమంది కూర్చుని ఇచ్చే అవార్డ్ కంటే లక్షలాది మంది ప్రేక్షకులు ఇచ్చేదే గొప్ప అవార్డ్ అని సుధ చెప్పుకొచ్చారు.
అవార్డుల వల్ల గర్వం, అహంకారం వస్తుందని ఆమె కామెంట్లు చేశారు.తాను చేసిన పాత్రల్లో చాలా గొప్ప పాత్రలు ఉన్నాయని సుధ తెలిపారు.
బాలచందర్ ఆర్టిస్ట్ ను బట్టి వాళ్ల టాలెంట్ ను గుర్తిస్తారని సుధ చెప్పుకొచ్చారు.గ్లామర్ పనిమనిషి క్యారెక్టర్ కు కూడా నీ మొహం సూట్ కాదని బాలచందర్ కామెంట్లు చేశారని సుధ తెలిపారు.ఆ తర్వాత తాను చెప్పిన క్యారెక్టర్ చేస్తే ఇండస్ట్రీలో సక్సెస్ అవుతావని బాలచందర్ చెప్పారని ఆ పాత్ర చేయలేకపోతే వెళ్లిపోవాలని ఆయన అన్నారని సుధ వెల్లడించారు. డేట్ల సమస్య వస్తే మేనేజర్ చూసుకునేవారని సుధ అన్నారు.
సెకండ్ సండే కూడా తాను ఖాళీగా ఉండేదానిని కాదని రోజుకు నాలుగు సినిమాలలో ఐదు సినిమాలలో నటించిన రోజులు కూడా ఉన్నాయని సుధ చెప్పుకొచ్చారు.కొన్నిసార్లు షూటింగ్ వాయిదా పడటంతో కొత్త ప్రాంతాలలో బట్టలు కొనుక్కున్న ఘటనలు కూడా ఉన్నాయని సుధ వెల్లడించారు.నటి సుధ ప్రస్తుతం సినిమాలలో వరుస ఆఫర్లను అందుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.