అందాల తార అతిలోక సుందరి.దివి నుంచి దిగివచ్చిన దేవకన్య.
అందం, అభినయంతో ఎన్నో మరుపురాని చిత్రాల్లో నటించి వెండితెరపై ఎవర్ గ్రీన్ హీరోయిన్ అనిపించుకుంది శ్రీదేవి.లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన అందాల తార తొలిసారి తమిళంలో కన్దన్ కరుణై తో ఎంట్రీ ఇచ్చింది.
ఆ తరువాత తెలుగు, మళయాళి, హిందీ సినిమాల్లో అగ్రహీరల సరసన యాక్ట్ చేసింది. తమిళంలో రజినీ – కమల్ హాసన్, తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ హిట్ ఫెయిర్ గా నిలిచింది.
తెలుగులో అందరి హీరోలతో యాక్ట్ చేసిన శ్రీదేవి ఎన్టీఆర్ కు మనవరాలిగా, అదే ఎన్టీఆర్ తో హీరోయిన్ గా స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆమెకే సాధ్యమైంది.దర్శకేంద్రకులు రాఘవేంద్రరావు డైరక్షన్ లో ఎక్కువ సినిమా చేసిన శ్రీదేవి…, ఎన్టీఆర్ తో కొండవీటి సింహం, వేటగాడు, సర్దార్ పాపారాయుడు, అక్కినేని నాగేశ్వరరావుతో ప్రేమాభిషేకం, బంగారు కానుక, ప్రేమకానుక, సూపర్ స్టార్ కృష్ణ తో కలవారి సంసారం, కృష్ణావతారం, బుర్రిపాలెం బుల్లోడు చిత్రాలతో అభిమానుల్ని అలరించారు.
అయితే శ్రీదేవీ నటించిన చిత్రాల్లో 1976లో కే.బాలచందర్ డైరక్షన్ లో విడుదలైన ‘మూండ్రు ముడిచ్చు’ సినిమా ప్రత్యేకమనే చెప్పుకోవాలి.ఎందుకంటే 13ఏళ్ల వయస్సులో రజినీకి సవితి తల్లిగా శ్రీదేవి యాక్ట్ చేసింది.ఈ సినిమా తమిళ చిత్రసీమకే మంచి పేరు తెచ్చి పెట్టింది.ముఖ్యంగా ఈ సినిమా తరువాత రజినీ, కమల్, శ్రీదేవి స్టార్ డమ్ ఒక్కసారిగా పెరిగింది.దీనంతటికి కారణం సినిమాలోని శ్రీదేవి క్యారక్టర్ ఈ చిత్రంలో రజినీ – కమల్ హాసన్.
ఇద్దరు శ్రీదేవిని ప్రేమిస్తారు.శ్రీదేవి మాత్రం కమల్ హాసన్ ను పెళ్లి చేసుకుంటుంది.
ఆ తరువాత కమల్ మరణిస్తాడు.కమల్ మరణానికి కారణం రజిని అని తెలిసి అతని తండ్రిని పెళ్లాడుతుంది.