ఎప్పుడూ ఏదో ఒక విషయంపై స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియా మాధ్యమాలలో తరచు వార్తల్లో నిలిచే “నటి శ్రీరెడ్డి” గురించి తెలుగు సినిమా తెలుగు మరియు తమిళ సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.అయితే ఈ అమ్మడు అప్పట్లో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై పలు వ్యక్తిగత విమర్శలు చేసి టాలీవుడ్ సినీ పరిశ్రమ బహిష్కరణకు గురైన సంగతి అందరికీ తెలిసిందే.
దీంతో అప్పటి నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే ఫైర్ అవుతోంది.
అయితే తాజాగా టాలీవుడ్ ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ “పవర్ స్టార్” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.
అయితే ఈ చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జీవిత గాథ ఆధారంగా తెరకెక్కుతుందని ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశాడు.దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు రామ్ గోపాల్ వర్మ జీవిత గాథ ఆధారంగా “పరాన్నజీవి” అనే కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే పోస్టర్ ని కూడా విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఇంతకీ విషయం ఏంటంటే రామ్ గోపాల్ వర్మ జీవిత గాథ ఆధారంగా తెరకెక్కుతున్న “పరాన్నజీవి” అనే చిత్రంలో నటి శ్రీ రెడ్డి ని ఓ కీలక పాత్రలో నటించాలని చిత్ర యూనిట్ సభ్యులు కోరినప్పటికీ ఆమె నిర్మొహమాటంగా నో చెప్పిందట.
అయితే ఈ విషయం గురించి ఇటీవలే స్పందించిన శ్రీరెడ్డి ఐ లవ్ రామ్ గోపాల్ వర్మ నేనెందుకు పరాన్నజీవి చిత్రంలో నటిస్తానని అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.దీంతో మరోమారు నటి శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ పై ఉన్నటువంటి ఆక్రోశాన్ని పరోక్షంగా వెళ్లగక్కిందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.