టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కాంబినేషన్ లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.2017 సంవత్సరం తర్వాత రెండేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న శృతిహాసన్ ఈ ఏడాది క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.శృతి హాసన్ గెస్ట్ రోల్ లో తెరకెక్కుతున్న వకీల్ సాబ్ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ నెల 9వ తేదీన విడుదల కానుంది.
గ్యాప్ తీసుకున్నా మళ్లీ వరుస అవకాశాలతో బిజీ అవుతున్న శృతిహాసన్ ప్రభాస్ సినిమాకు రెమ్యునరేషన్ భారీగా పెంచేసిందని కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటోందని ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమా కోసం శృతి ఏకంగా కోటి రూపాయలు తీసుకుంటూ ఉండటం గమనార్హం.అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన శృతిహాసన్ కెరీర్ మొదట్లో వరుస ఫ్లాపుల వల్ల ఇబ్బంది పడినా ఆ తరువాత వరుస హిట్లతో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్నారు.
వకీల్ సాబ్, సలార్ సినిమాలు కూడా హిట్టైతే శృతి రెమ్యునరేషన్ ను మరింత పెంచే అవకాశాలు ఉన్నాయని సమాచారం.మొదట సలార్ సినిమాలో హీరోయిన్ గా దిశాపటానీ నటిస్తున్నట్టు వార్తలు రాగా శృతిహాసన్ ను హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.
క్రాక్ హిట్ తో ఫాంలోకి వచ్చిన శృతిహాసన్ కు వరుస అవకాశాలు వస్తున్నాయి.రీఎంట్రీ తరువాత శృతిహాసన్ తీసుకున్న అత్యధిక పారితోషికం ఇదే కావడం గమనార్హం.
ప్రభాస్ శృతిహాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ప్రస్తుతం శృతిహాసన్ తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో కూడా నటిస్తూ వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు.