తెలుగుతో పాటు ఇతర భాషల్లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోయిన్లలో ఒకరైన శృతిహాసన్ చిరంజీవి, బాలకృష్ణలకు జోడీగా నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి హాసన్ క్రాక్ సినిమాలో నటించడానికి ముందు తన సినీ కెరీర్ గురించి రకరకాలుగా మాట్లాడుకున్నారని తెలిపారు.
విమర్శల గురించి తాను పట్టించుకోనని శృతి చెప్పుకొచ్చారు.
నటన విషయంలో తనకు ఎన్నో ఆలోచనలు ఉన్నాయని ఆమె కామెంట్లు చేశారు.
లండన్ లో కోర్స్ చేసిన తర్వాత పాత్రను అర్థం చేసుకునే విషయంలో నా ఆలోచనలు చాలా మారాయని శృతి వెల్లడించారు.తెలుగులోనే నాకు తొలి సక్సెస్ దక్కిందని ఇతర ఇండస్ట్రీలలో ఆఫర్లు వస్తున్నా తెలుగు ప్రత్యేకమని ఆమె అన్నారు.
కొత్త ప్రయత్నాలు చేసే సమయంలో సందేహాలు వస్తాయని బాలకృష్ణ మూవీలో గమ్మత్తైన రోల్ లో తాను కనిపిస్తానని శృతి చెప్పుకొచ్చారు.
దర్శకుడు గోపీచంద్ మలినేని తనను ఎక్కువగా నమ్ముతారని ఆమె కామెంట్లు చేశారు.వయస్సు ఎంత దాచినా దాగదని మనిషి కంటే మనసు యవ్వనంగా ఉండాలని తాను నమ్ముతానని శృతి వెల్లడించారు.ప్రస్తుతం కెరీర్ పైనే దృష్టి పెట్టానని ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడాలని నాకు లేదని శృతి హాసన్ చెప్పుకొచ్చారు.
ప్రభాస్ మంచి మాటకారి అని అయితే అందరూ ప్రభాస్ ఎక్కువగా మాట్లాడరని చెబుతుంటారని శృతి హాసన్ వెల్లడించారు.
కరోనా వైరస్ వల్ల పిల్లల విషయంలో తనకు ఆందోళన ఎక్కువగా ఉందని శృతి అన్నారు.
కరోనా వైరస్ చిన్నారులపై, చిన్నారుల తల్లిదండ్రులపై తీవ్ర ప్రభావం చూపుతోందని శృతి చెప్పుకొచ్చారు.కరోనా వైరస్ వల్ల ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని శృతిహాసన్ వెల్లడించారు.
శృతి హాసన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.