కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ఎవరికి తోచిన విధంగా వారు సహాయం చేస్తున్నారు.అలాగే డాక్టర్లు, వైద్యులు, నర్స్లు పారిశుధ్య కార్మికులు అవిశ్రాంతంగా సేవలు అందిస్తున్నారు.
ప్రాణాలకి ముప్పు అని తెలిసి కూడా ధైర్యంగా బాధితులకి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.ఎన్నడూ లేని విధంగా వైద్య సిబ్బంది అందిస్తున్న ఈ సేవలకి దేశం యావత్తు సలాం చేస్తుంది.
ఇలాంటి సమయంలో సెలబ్రిటీలు వారి పెద్ద మనసు చాటుకుంటున్నారు.విరాళాలు ఇచ్చి ప్రభుత్వానికి అండగా నిలబడుతున్నారు.
అయితే బాలీవుడ్ హీరోయిన్ మాత్రం కరోనా బాధితులకి అండగా నిలబడేందుకు నర్సుగా మారింది.
బాలీవుడ్ హీరోయిన్ శిఖా మల్హోత్రా కాంచలీ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.
ఆమె నర్సింగ్ లో డిగ్రీ పొందారు.కానీ ఎప్పుడూ నర్సింగ్ ను కెరీర్ గా ఎంచుకోలేదు.
అయితే ప్రస్తుతం ఉన్న క్లిష్టమైన పరిస్థితుల్లో సాధ్యమైనంత సాయం చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ నర్సింగ్ గౌన్ వేసుకున్నారు.ముంబైలోని ఓ ఆస్పత్రిలో నర్సుగా సేవలందిస్తున్నారు.
ఈ విషయంపై స్పందించిన ఆమె నర్సింగ్ గ్రాడ్యుయేషన్ సమయంలో సమాజానికి సేవ చేస్తామని ప్రమాణం చేశాం.ఇలాంటి సమయంలోనే ఆ మాటపై నిలబడాలి అని పేర్కొంది.
ఆమె తీసుకున్న ఈ నిర్ణయానికి సోషల్ మీడియాలో చాలా మంది నుంచి ప్రశంసలు వస్తున్నాయి.ఇలా ధైర్యంగా ముందుకి వచ్చేవారు చాలా తక్కువ మంది ఉంటారని కొనియాడుతున్నారు.