గత కొంత కాలం నుంచి కోలీవుడ్ లో నటి మీరా మిథున్ టాక్ అఫ్ ది ఇండస్ట్రీలో మారింది.వరుసగా స్టార్లపై వివాదాస్పద వాఖ్యలు చేస్తూ సంచలనంగా మారింది.
కేవలం స్టార్ హీరోలని టార్గెట్ చేయడం ద్వారా వారి ఫ్యాన్స్ తనని ఎలాగూ ట్రోల్ చేస్తారు కాబట్టి దానితో కావాల్సినంత ప్రచారం, గుర్తింపు వస్తుందని ఈమె భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.అయితే మీరా మిథున్ చేసిన వాఖ్యలని చాలా మంది తీవ్రంగా ఖండిస్తున్నారు.
హీరో సూర్య సైతం తనపై మీరా చేసిన కామెంట్స్ పై స్పందించి కౌంటర్ ఇచ్చాడు.ఇదిలా ఉంటే ఇప్పుడు మీరా మిథున్ వివాదంలోకి మరో హీరోయిన్ వచ్చి చేరింది.
మీరామిథున్ తనపై హత్యా బెదిరింపులకు పాల్పడుతోందని హీరోయిన్ శాలు షమ్ము పోలీస్ కమిషనర్ కి ఫిర్యాదు చేసింది.ఆమె నుంచి తనకి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొంది.
ఇప్పుడు శాలుషమ్ము చేసిన ఫిర్యాదు కోలీవుడ్ లో సంచలనంగా మారింది.వరుత్త పడాద వాలిబర్ సంఘం చిత్రంలో నటి శాలుషమ్ము నటించింది.విజయ్, సూర్యలపై మీరా చేసిన వాఖ్యలని ఆమె తీవ్రంగా ఖండించింది.దీంతో ఆమె తన అనుచరులతో ఫోన్ ద్వారా హత్యా బెదిరింపులకు పాల్పడుతోందని శాలుషమ్ము చెప్పింది.
సినీ రంగంలో తనకు ఆమెకు మధ్య పోటీ ఉందని తెలిపింది.అయితే ఆమెకు అవకాశాలు లేకపోవడంతో తనపై అసూయ పెంచుకుని ఇలా బెదిరింపులకి పాల్పడటం, తనను వ్యభిచారిగా చిత్రీకరించి అవకాశం లేకుండా చేసి పరిశ్రమ నుంచిపంపించేయాలని చూస్తుందని పేర్కొంది.
అదేవిధంగా సామాజిక మాధ్యమాల్లో తన ఫొటోలను పొందుపరుస్తూ కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తోందని చెప్పింది.దీంతో తాను తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తోందని చెప్పింది.
మీరా మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది.