శాండల్వుడ్ను ఓ కుదుపు కుదుపుతోన్న డ్రగ్స్ కేసులో హీరోయిన్లు సంజనా గల్రానీ, రాగిణి ద్వివేదిని విచారిస్తోన్న క్రమంలో అనేకానేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.వీరిద్దరితో పాటు మరో ఆరుగురిని కూడా సీబీఐ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారట.
ఇక ఇద్దరు హీరోయిన్లను బెంగళూరులోని మహిళా స్వాంతన కేంద్రంలో ఉంచిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే విచారణ అధికారులు ఉదయమే ఈ కేంద్రానికి చేరుకుని మరోసారి సంజన, రాగిణిపై ప్రశ్నల వర్షం కురిపించారు.
సంజనకు ఒక్క బెంగళూరులోనే ఏకంగా 10కు పైగా ప్లాట్లు ఉన్నట్టు తేలింది.సంజన సైతం ఈ విషయాన్ని ఒప్పుకుందని తేలింది.
సంజనకు సినిమాల్లో ఛాన్సులు లేకపోయినా ఈ రేంజ్లో ఆస్తులు ఎట్లా వచ్చాయో కూడా అధికారులకు అర్థం కాని పరిస్థితి.సంజన ఓ కన్నడ రియల్ ఎస్టేట్ వ్యాపారితో ప్రేమాయణం నడిపినట్టు టాక్ ఉంది.
అప్పట్లోనే ఆమె రియల్ ఎస్టేట్ ద్వారా ఇవన్నీ సంపాదించిందా ? అన్నది కూపీ లాగుతున్నారు.ఇక రాగిణి, సంజనాలు విచారణలో పలువురు సినీ నటులు, రాజకీయ నాయకుల పుత్రరత్నాలు సైతం డ్రగ్స్కు బానిస అయ్యారని చెప్పడంతో పాటు వారి పేర్లు కూడా చెప్పారని తెలుస్తోంది.
వీరు చెప్పిన పేర్ల ఆధారంగా ఆ రాజకీయ నేతల పుత్రులు, ఆ సినీ నటులకు నోటీసులు జారీ చేయాలని సీసీబీ పోలీసులు నిర్ణయించుకున్నారు.
ఇక సంజనాకు బెంగళూరు నగరంలో ఉన్న పది ప్లాట్లకు ప్రతి రోజు సినిమా రంగానికి చెందిన ప్రముఖులు, మ్యూజిక్ డైరెక్టర్లు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేల వారసులు కూడా వచ్చి వెళుతున్నట్టు పోలీసుల విచారణలో బయటకు పొక్కింది.
దీంతో ఈ కేసులో సంజన చుట్టూ మరింతగా ఉచ్చు బిగుసుకునే ఛాన్సులు ఉండడంతో ఆమె కేసు నుంచి తప్పించుకునేందుకు సినిమా రంగానికి చెందిన ప్రముఖులు సలహాలు తీసుకుంటోందట.ఇదిలా ఉండగా డ్రగ్స్ కేసులో చామరాజపేట ఎమ్మెల్యే జమీర్ఖాన్ ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.