సినిమా హీరోయిన్స్ విషయం వచ్చేసరికి ఎక్కువ బ్రేక్ అప్ కథలు వింటూ ఉంటాం.డేటింగ్, విడిపోవడం అనేది సెలబ్రేటీల జీవితాలలో కామన్ గా ఉండే విషయం.
అయితే సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్, జూనియర్ ఆర్టిస్ట్ లు ప్రేమించి మోసపోయాం అంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతారు.అయితే ఇప్పుడు ఓ హీరోయిన్ ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది.
తాను ప్రేమించి మోసపోయానంటూ ఓ నటుడు మీద ఫిర్యాదు చేసింది.ప్రేమ పేరుతో తనని వాడుకొని పెళ్లి చేసుకోమని అడిగితే తప్పుంచుకు తిరుగుతున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.
తనకి న్యాయం చేయాలని కోరింది.తమిళ రియాలిటీ షో బిగ్ బాస్ 3 ద్వారా పరిచయం అయిన నటుడు దర్శన్ తనను మోసం చేశాడంటూ హీరోయిన్ నటి సనమ్ శెట్టి వాపోయింది.
ఈ మేరకు చెన్నైలోని అడయార్ పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేసింది.కేసు నమోదు చేసిన పోలీసులు దర్శన్ కోసం గాలిస్తున్నారు.
సనమ్ శెట్టి తొలుత మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించింది.ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించింది.బిగ్ బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న దర్శన్ నటుడుగా అవకాశాలు పెంచుకొని తమిళంలో రాణిస్తున్నాడు.వారిద్దరి మధ్య అనుకోకుండా జరిగిన పరిచయం ప్రేమగా మారింది.
ఇద్దరూ ఏడాది పాటు రిలేషన్ షిప్ లో ఉన్నారు.ఆ తర్వాత ఏమైందో కానీ సనమ్ తో దర్శన్ బంధాలను తెంచుకున్నాడు.
దీంతో సనమ్ పోలీసులను ఆశ్రయించింది.పెళ్లి చేసుకోవాలని కోరగానే అతని ప్రవర్తనలో మార్పు వచ్చిందని, తనతో మొహమాటం లేకుండా పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పి వెళ్లిపోయాడని, తనకు న్యాయం చేయాలని సనం శెట్టి కోరుతుంది.