ఈ మధ్య కాలంలో ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ వివాదాల్లో చిక్కుకోవడంతో సమంత పేరు మారుమ్రోగింది.తమిళ ప్రేక్షకుల నుంచి సమంత నటించిన రాజీ పాత్ర విషయంలో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది.
అయితే ఫ్యామిలీ మేన్2 వెబ్ సిరీస్ రిలీజైన తర్వాత సమంత పాత్రకు ప్రశంసలు వస్తున్నాయి.ఇప్పటివరకు సాఫ్ట్ రోల్స్ లో ఎక్కువగా నటించిన సమంత ఛాన్స్ వస్తే అన్ని పాత్రల్లో అద్భుతంగా నటించగలనని ప్రూవ్ చేసుకున్నారు.
రాజీ పాత్ర కొరకు రాజ్ అండ్ డీకే తనను సంప్రదించిన సమయంలో రాజీ పాత్ర పోషించాలంటే సున్నితత్వం మరియు సమతుల్యత అవసరమని తాను భావించానని సమంత చెప్పుకొచ్చారు.తాను ఈలం యుద్ధంలో పాల్గొన్న మహిళలకు సంబంధించిన డాక్యుమెంటరీలు కూడా చూశానని సమంత అన్నారు.
ఆ డాక్యుమెంటరీలు తాను చూసిన సమయంలో ఈలం మహిళలు పడిన ఇబ్బందులు, వాళ్లు బయటకు చెప్పుకోలేని భయం గురించి తెలిసి షాకయ్యానని సమంత పేర్కొన్నారు.
అయితే ఆ వీడియోలకు సోషల్ మీడియాలో వ్యూస్ ఎక్కువగా లేకపోవడం కూడా తాను గమనించానని సమంత చెప్పుకొచ్చారు.ఈలంకు చెందిన పదివేల మంది ప్రాణాలు కోల్పోయినా ప్రపంచం మాత్రం వాళ్లను పట్టించుకోలేదని ఆమె అన్నారు. లక్షల సంఖ్యలో ప్రజలు ఇళ్లను, ఉపాధిని కోల్పోయారని సమంత తెలిపారు.
రాజీ కథ కల్పితమైనా ఈ ఘటన ఈలంకు చెంది చనిపోయిన వాళ్లకు యుద్ధం జ్ఞాపకాలను తలచుకుంటూ జీవిస్తున్న వాళ్లకు నివాళి అని సమంత అన్నారు.
వివాదం గురించి పరోక్షంగా సమంత స్పందించడంతో పాటు ఆ వివాదానికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.పెళ్లి తర్వాత అభినయ ప్రధాన పాత్రలను ఎంచుకుంటున్న సమంత మరో అద్భుతమైన పాత్రను తన ఖాతాలో వేసుకున్నారు.రాజీ పాత్ర రోల్ మోడల్ లాంటి పాత్ర అని సమంత చెప్పుకొచ్చారు.