నిన్నటి తరం హీరోయిన్ రోజా త్వరలో తన వారసురాలు అన్షు మాళికను వెండి తెరకు పరిచయం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఇప్పటికే బుల్లి తెరపై సందడి చేసిన అన్షు త్వరలోనే వెండి తెరపై బాల నటిగా కనిపించే అవకాశాలున్నాయి.
అయితే మొదట అన్షు తెలుగులో నటిస్తుందా లేక తమిళంలోనా అనే సందేహాలు ఉన్నాయి.ప్రస్తుతానికి తెలుగు మరియు తమిళంకు చెందిన పలువురు దర్శకులు మరియు నిర్మాతలు రోజాను సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది.
హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న రోజా ప్రస్తుతం బుల్లి తెరపై యాంకర్గా, గెస్ట్గా, జడ్జీగా పలు రూపాల్లో ప్రేక్షకులకు దగ్గరగా ఉంటూనే ఉంది.ఇక పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా రోజా నటించింది.
ఇటీవలే ఎన్నికల్లో పోటీ చేసి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికైన రోజా సినిమాల్లో నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.అందుకే తన వారసురాలిని సినిమాల్లోకి తీసుకు రావాలని భావిస్తోంది.
ప్రస్తుతానికి బాలనటిగా తీసుకు వచ్చి, ఆ తర్వాత హీరోయిన్గా మార్చాలనేది రోజా ప్లాన్గా తెలుస్తోంది.రోజా భర్త సెల్వమణి తమిళ దర్శకుడు అనే విషయం తెల్సిందే.
తల్లి, తండ్రి ఇద్దరు కూడా ఇండస్ట్రీకి చెందిన వారే కావడంతో అన్షు మాళిక సినీ ఎంట్రీకి మార్గం సుగమం అయ్యింది.