కొన్ని సంవత్సరాల క్రితం టీవీ ఛానెళ్లు ఎక్కువగా డ్యాన్స్ షోలు, సింగింగ్ షోలు, గేమ్ షోలకు సంబంధించిన ప్రోగ్రామ్ లపై ఎక్కువగా ఆధారపడేవి.ఆ ప్రోగ్రామ్ లకే టీఆర్పీ రేటింగ్ భారీగా వచ్చేది.
అయితే జబర్దస్త్ రాకతో మిగతా ప్రోగ్రామ్ ల రేటింగులు తగ్గుముఖం పట్టాయి.టీవీ ప్రేక్షకులు సైతం కామెడీ షోలపైనే ఎక్కువగా ఆసక్తి చూపించారు.
దీంతో టీవీ ఛానెళ్లలో కామెడీ షోల హవా ప్రారంభమైంది.
దీంతో టీవీ ఛానెళ్లు కామెడీ షోలకు, ఎంటర్టైన్మెంట్ ప్రాధాన్యత ఉన్న కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి.
అయితే కామెడీతో కొన్ని షోలు హిట్ అవుతున్నప్పటికీ జబర్దస్త్ స్థాయిలో ఎంటర్టైన్మెంట్ అందించడంలో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నాయి.దీంతో పలు టీవీ ఛానెళ్లు రెండున్నర గంటల స్పెషల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాయి.
ఈ ప్రోగ్రామ్ లకు రేటింగులు బాగానే వస్తున్నాయి.
జీ తెలుగు ఛానెల్ వచ్చే ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఇది సరికొత్త సంబరం పేరుతో స్పెషల్ ప్రోగ్రామ్ ను ప్రసారం చేయనుంది.
రవి, శ్యామల యాంకర్లుగా వ్యవహరిస్తున్న ఈ షోకు నటి, పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ గెస్ట్ గా వచ్చారు.ఈ ప్రోగ్రామ్ కు సంబంధించిన కొన్ని ప్రోమోలు యూట్యూబ్ లో హల్చల్ చేస్తున్నాయి.
ఆ ప్రోమోలో జానీ సినిమాలోని ఈ రేయి తీయనిది పాటతో రేణు దేశాయ్ ఎంట్రీ ఇచ్చింది.
రేణు దేశాయ్ పవన్ పాటతో ప్రోగ్రామ్ కు జడ్జీగా రావడంతో ఫ్యాన్స్ ఈలలు వేస్తూ గోల చేశారు.
ఆ తరువాత రేణు దేశాయ్ స్కిట్ లా చేయాలని రవిని తాతగా, శ్యామల అవ్వగా నటించమని చెబుతుంది.రేణు దేశాయ్ తాత అని చెప్పగానే ముసలి తాత ముడత మొహం పాట ప్లే కాగా కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తూ రవి ముసలితాతలా నటించాడు.
దీంతో రవి ఓవర్ యాక్టింగ్ అవుతోంది అంటూ రేణు దేశాయ్ రవి ఓవరాక్షన్ కు గట్టిగా కౌంటర్ ఇచ్చింది.స్కిట్ లో భాగంగా వీళ్లు చేసిన కామెడీ బాగా పండింది.