స్టార్ హీరోయిన్ రష్మిక శాండిల్ వుడ్, టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో నటిగా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే.వరుస విజయాలతో జోరుమీదున్న రష్మికకు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి దర్శకనిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.
తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న రష్మికకు ఇతర స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటిగా వరుసగా ఆఫర్లు వస్తుండటం గమనార్హం.
అయితే తాజాగా రష్మిక మందన్నా తన తల్లిదండ్రులు సంతోషంగా లేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వరుస విజయాలను ఎంజాయ్ చేస్తున్న ఈ కన్నడ బ్యూటీ పుష్ప సినిమాతో పాటు ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో నటిస్తున్నారు.బాలీవుడ్ లో రష్మిక చేతిలో గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాలు ఉన్నాయి.
దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గినా అడపాదడపా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా వైరస్ బారిన పడే అవకాశాలు ఉంటాయి.తాను వరుసగా సినిమా షూటింగ్ లలో పాల్గొనడం అమ్మానాన్నలకు నచ్చలేదని రష్మిక మందన్నా చెప్పుకొచ్చారు.కొన్ని నెలల పాటు షూటింగ్ లను వాయిదా వేసుకోవాలని తనకు చెప్పారని రష్మిక మందన్నా వెల్లడించారు.
తల్లిదండ్రులు తనపై చూపిస్తున్న ప్రేమకు తనకు సంతోషంగా ఉందని ఆమె అన్నారు.
అయితే షూటింగ్ లు వాయిదా వేయడం మన చేతుల్లో ఉండదని రష్మిక మందన్నా చెప్పుకొచ్చారు.తాను ప్రస్తుతం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లో పాల్గొంటున్నానని రష్మిక వెల్లడించడం గమనార్హం.పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ రిజల్ట్ ను సొంతం చేసుకుంటే రష్మికకు నటిగా ఆఫర్లు మరింత పెరుగుతాయనడంలో సందేహం లేదు.
గతంలో పోషించిన పాత్రలకు భిన్నమైన పాత్రలో రష్మిక మందన్నా పుష్ప సినిమాలో కనిపిస్తారని తెలుస్తోంది.