నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందిన రష్మిక మందాన… తెలుగులో దుమ్మురేపుతోంది.తన క్యూట్ లుక్స్ తో పాటు చక్కటి నటనతో దూసుకుపోతుంది.
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.పలు హిట్ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి.
ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అతి తక్కువ కాలంలోనే పలు హిట్ సినిమాల్లో నటించి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.
పలు వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.
భారీగా పారితోషకం తీసుకుంటూ ముందుకెళ్తోంది.సినిమాల ద్వారా వచ్చిన డబ్బుతో పలు ఆస్తులను కూడబెడుతుంది.
హైదరాబాద్, గోవాతో పాటు కూర్గ్ లో పలు ఇండ్లు కొనుగోలు చేసింది.తాజాగా ఈ ముద్దుగుమ్మ ముంబైలోనూ ఓ ఇల్లు కొనుగోలు చేసింది.
ఆమె కొత్త ఇంటిని చూసి, ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ సినిమాలు చేస్తుండటంతో అక్కడ ఇబ్బంది ఉండకూడదనే ముంబైలో ఇల్లు తీసుకున్నట్లు వెల్లడించింది.
గతంలో ముంబైకి వచ్చినప్పుడు తను హోటల్లో ఉండేది.కానీ అక్కడి ఇబ్బంది ఎందుకు అనే ఉద్దేశంతో తను ఓ ఇంటిని తీసుకుంది.
బాలీవుడ్లో మిషన్ మజ్ను, గుడ్బై సినిమాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.దీంతో హైదరాబాద్, ముంబై మధ్య తరుచూ జర్నీలు చేయాల్సి వస్తుంది.అక్కడ హోటల్ అంటే చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి.వీటి నుంచి తను బయట పడేందుకు ఓ ఇల్లు తీసుకుంది.ప్రస్తుత అక్కడ తనకు చాలా సౌకర్యవంతంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రశ్మిక పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాలు చేస్తుంది.అల్లు అర్జున్ తో పుష్ప, శర్వానంద్ తో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాల్లో నటిస్తుంది.అటు హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన మిషన్ మజ్ను, అమితాబ్ కాంబినేషన్తో గుడ్బై అనే ప్రాజెక్టుల్లో నటిస్తుంది.
పలు కొత్త ప్రాజెక్టులకు సంబంధించి చర్చలు నడుస్తున్నట్లు తెలుస్తోంది.