బాలీవుడ్ లో మద్రాస్ కేఫ్ సినిమాతో తెలుగులో మనం సినిమాతో సినిమాల్లోకి రాశీఖన్నా ఎంట్రీ ఇచ్చారు.మనం సినిమాలో గెస్ట్ రోల్ లో నటించిన రాశీఖన్నా ఊహలు గుసగుసలాడే సినిమాలో ఫుల్ లెంగ్త్ హీరోయిన్ రోల్ లో నటించి సక్సెస్ ను అందుకున్నారు.
తెలుగుతో పాటు ఇతర భాషల సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న రాశిఖన్నా ఒకవైపు తెలుగు సినిమాల్లో నటిస్తూనే హిందీ వెబ్ సిరీస్ లకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం గమనార్హం.
తెలుగులో ఈ బ్యూటీ మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ సినిమాలో నటిస్తుండగా ఆ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.
తాజాగా ఈ బ్యూటీ షూటింగ్ స్పాట్ లోని ఫోటోను అభిమానులతో షేర్ చేసుకోవడంతో పాటు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.షూటింగ్ స్పాట్ లో తాను నిద్రపోతానని ఆమె అన్నారు.
కుర్చీపైనే కూర్చుని రాశీఖన్నా నిద్రపోతూ ఉండటం గమనార్హం.
రాశీఖన్నా షేర్ చేసిన ఫోటోకు మూడున్నర లక్షలకు పైగా లైక్స్ రావడం గమనార్హం.షూటింగ్ గ్యాప్ లో నిద్రపోయే సమయంలో తాను వెకేషన్ గురించి కలలు కంటానని రాశీఖన్నా అన్నారు.పక్కా కమర్షియల్ తో సక్సెస్ సాధిస్తే రాశీఖన్నాకు ఆఫర్లు మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సత్తా చాటాలని రాశీఖన్నా అనుకుంటున్నారు.రాశీఖన్నా ఫన్నీ క్యాప్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు రాశీఖన్నా ఫోటో గురించి తమదైన శైలిలో కామెంట్లు చేస్తుండటం గమనార్హం.మలయాళ, తమిళ భాషల్లో సైతం రాశీఖన్నా చేతిలో మంచి ప్రాజెక్టులు ఉన్నాయి.మారుతి గత సినిమా ప్రతిరోజూ పండగే సినిమాలో కూడా రాశీఖన్నా హీరోయిన్ అనే సంగతి తెలిసిందే.
ఆ సినిమా సక్సెస్ సాధించడంతో పక్కా కమర్షియల్ సినిమా కోసం కూడా మారుతి రాశీఖన్నాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.