రాగిణి ద్వివేది ఓ భారతీయ సినీ నటి.తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో కలిపి కొన్ని సినిమాల్లో నటించింది.2009లో సినీ పరిశ్రమకు పరిచయం అయింది.కాగా గత ఏడాది కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కేసులో దొరికింది.
కాగా ఇటీవలే కోర్టు రాగిణి కు బెయిల్ అందించిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
జెండాపై కపిరాజు అనే సినిమా ద్వారా తెలుగు పరిశ్రమలో పరిచయమైనా రాగిణి.
ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇదిలా ఉంటే గత ఏడాది డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న ఆమెకు అంతర్జాతీయ పరంగా డ్రగ్స్ ముఠాతో సంబంధాలున్నాయని తేలింది.
అంతేకాకుండా సినీ పరిశ్రమలో చాలా మందికి డ్రగ్స్ సరఫరా చేయగా.గత ఏడాది సెప్టెంబర్ లో ఈ విషయం బయటపడింది.
కాగా ఇందులో మరో నటి సంజనా కూడా ఉండగా.రాగిణి, సంజనాను బెంగుళూరులో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.
అంతేకాకుండా రాగిణి ఇంటిపై కూడా సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సోదాలు చేశారు.తన ఆస్తులపై కూడా కొన్ని దాడులు నిర్వహించారు.
కాగా వీటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.కాగా బెయిల్ కోసం కర్ణాటక హైకోర్టులో రాగిణి పిటిషన్ చేయగా.దీనికి ఆ కోర్టు నిరాకరించింది.అంతటితో ఆగక నవంబర్ లో సుప్రీంకోర్టునలో పిటిషన్ చేయగా.అందులో తను తన గురించి ” తనపై కావాలనే తప్పుడు ప్రచారాలు చేశారని, డ్రగ్స్ లభించకుండా తనను కావాలనే జైలులో వంద రోజులు ఉంచారని” తెలిపింది.దీంతో సుప్రీంకోర్టు రాగిణి చెప్పిన విషయాలను చర్చించి ఇటీవలే గురువారం బెయిల్ మంజూరు చేశారని ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.