బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాధికా ఆప్టే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై సంచలన వ్యాఖ్యలు చేశారు.తాను రక్తచరిత్ర సినిమాలో నటించిన సమయంలో వర్క్ కు తగిన రెమ్యునరేషన్ లభించలేదని ఆమె వెల్లడించారు.
ఆ మూవీ షూటింగ్ సమయంలో తన టైమ్ ను బాగా వాడుకున్నారని ఆమె పేర్కొన్నారు.సినిమాల్లో ఎక్కువగా గ్లామరస్ రోల్స్ లో నటించే రాధికా ఆప్టే రక్తచరిత్ర మూవీలో మాత్రం డీగ్లామరస్ రోల్స్ లో నటించారు.
తాను రక్తచరిత్ర తెలుగు వెర్షన్ కోసం ఓకే చెప్పానని తనకు తెలుగు వెర్షన్ కు మాత్రమే రెమ్యునరేషన్ ఇచ్చారని ఆమె పేర్కొన్నారు.అయితే షూటింగ్ కు వెళ్లిన తరువాత తెలుగుతో పాటు తమిళంలో షూటింగ్ చేశారని అలా తాను రెండు సినిమాలకు నటించినా రెమ్యునరేషన్ మాత్రం ఒక సినిమాకే లభించిందని ఆమె అన్నారు.
రక్తచరిత్ర సినిమాలో పెద్దపెద్ద స్టార్స్ నటించారని ఆమె వెల్లడించారు.
ఆ మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో ఎప్పుడు పూర్తవుతుందో కూడా తనకు తెలిసేది కాదని ఆమె అన్నారు.
ఈ సినిమా కొరకు తన సినిమాన్ని ఎక్కువగా కేటాయించానని అయితే తన సమయం, ప్రతిభ వృథా అయ్యాయని రాధికా ఆప్టే పేర్కొన్నారు.రక్తచరిత్ర సినిమాకు ఎందుకు సైన్ చేశానా.? అని తనకు అనిపించిందని ఆమె వెల్లడించారు.ఆర్జీవీ డైరెక్షన్ లో తెరకెక్కిన రంగీలా, సత్య సినిమాలు తనకు ఇష్టమని ఆమె అన్నారు.
ఆ సినిమాలకు తాను వీరాభిమానినని రాధికా ఆప్టే అన్నారు.వర్మతో వర్క్ చేస్తే కొత్త విషయాలు నేర్చుకోవచ్చని అనుకున్నానని కానీ తరువాత బాధ పడ్డానని ఆమె తెలిపారు.
వర్మపై రాధికా ఆప్టే చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.రాధికా ఆప్టే చేసిన కామెంట్లపై వర్మ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.