సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్లకు ఎక్కువగా ఆఫర్లు రావని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతున్నా కొంతమంది హీరోయిన్లు ఆ ప్రచారంలో నిజం లేదని ప్రూవ్ చేస్తున్నారు.హీరోయిన్ ప్రియమణి పెళ్లి తర్వాత కూడా వరుస ఆఫర్లతో బిజీగా ఉంటూ విరాటపర్వం, నారప్ప సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
పరుత్తివీరన్ సినిమాలో అద్భుతంగా నటించి జాతీయ అవార్డును సొంతం చేసుకున్న ప్రియమణి నారప్పలో సుందరమ్మ అనే పల్లెటూరి యువతి పాత్రలో నటిస్తున్నారు.
అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 20వ తేదీ నుంచి నారప్ప మూవీ స్ట్రీమింగ్ కానుంది.
సినిమా రిలీజ్ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన ప్రియమణి ఎన్నో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.వెంకీ సార్ తో కలిసి పని చేయడం తనకు సంతోషంగా ఉందని పల్లెటూరి అమ్మాయి పాత్రలో తెలుగు మూవీలో నటించడం తనకు డబులు బోనస్ అని ప్రియమణి చెప్పుకొచ్చారు.
నారప్ప మూవీ స్క్రిప్ట్ ప్రకారం తాను ట్యాన్ అయినట్టు కనిపిస్తానని ప్రియమణి అన్నారు.
నారప్ప సినిమాలో పాత్ర కోసం బెస్ట్ ఇవ్వడానికి తాను ప్రయత్నించానని మంచి పేరు వస్తే తాను సంతోషిస్తానని ప్రియమణి చెప్పుకొచ్చారు.సుందరమ్మ పాత్రకు చీర పైకి కట్టుకోవాలని తానే ఆ పాత్ర కోసం హెయిర్ స్టైల్ కూడా చేయించుకున్నానని ప్రియమణి అన్నారు.భవిష్యత్తు గురించి తాను ఆలోచించలేదని థర్డ్ వేవ్ ప్రచారం నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచనలు చేశారు.
సినిమాల్లో తల్లి పాత్రలు చేస్తున్న ప్రియమణి రియల్ లైఫ్ లో తల్లి ఎప్పుడవుతారనే ప్రశ్నకు స్పందిస్తూ ఇప్పుడే కాదని నిజ జీవితంలో తల్లిని కావడానికి సమయం పడుతుందని చెప్పుకొచ్చారు.తన భర్త ప్రస్తుతం యూఎస్ లో ఉన్నారని కరోనా సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యమని ప్రియమణి చెప్పుకొచ్చారు.