మల్లు బ్యూటీ అయిన హీరోయిన్ పూర్ణ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ టైంలోనే ఊహించని గుర్తింపు సొంతం చేసుకుంది.మహాలక్ష్మి అనే సినిమాతో మెడికల్ చదువుకోవాలనే కల ఉన్న పేదింటి అమ్మాయి పాత్రలో నటించి తెలుగులోకి తెరంగేట్రం చేసింది.
తరువాత అల్లరి నరేష్ సీమటపకాయ్ సినిమాతో హీరోయిన్ గా టర్న్ తీసుకొని వరుస సినిమాలు చేసింది.రవిబాబు దర్శకత్వంలో పూర్ణ చేసిన హర్రర్ థ్రిల్లర్ మూవీస్ అవును సిరీస్ ఆమెని మంచి పేరు తీసుకొచ్చాయి.
ప్రస్తుతం ఆమె బ్యాక్ డోర్ అనే సినిమాతో పాటు మరో చిన్న సినిమాలో లీడ్ రోల్ లో నటించింది.అలాగే బాలకృష్ణ అఖండ మూవీలో నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో పూర్ణ కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.
ఈ సినిమాతో విలనీగా ఆమె మరింత బిజీఅయ్యే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.
ఇదిలా ఉంటే మరో వైపు టెలివిజన్ షోలలో కూడా ఈ బ్యూటీ మెరుస్తుంది.
ఆ మధ్య పూర్ణని ఓ గ్యాంగ్ పెళ్లి పేరుతో ట్రాప్ చేసి మోసం చేసే ప్రయత్నం చేసింది.అయితే త్రుటిలో వారి బారి నుంచి ఆమె బయటపడింది.
దీంతో అప్పటి నుంచి పెళ్లి అంటేనే భయపడిపోతుంది.కాని ఆమె తల్లిదండ్రులు మాత్రం పూర్ణకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనే ఆలోచనతో ఉండి ఆమెని కూడా ఒప్పించినట్లు తెలుస్తుంది.
పూర్ణ స్వతహాగా ముస్లిమ్ కుటుంబానికి చెందిన అమ్మాయి అనే విషయం చాలా మందికి తెలియదు.సామ్నా కాశీమ్.
స్క్రీన్ నేమ్ గా పూర్ణ అని పెట్టుకుంది.అన్ని అనుకున్నట్లు సెట్ అయితే వచ్చే ఏడాదిలో పూర్ణ పెళ్లి చేసుకునే అవకాశం ఉంది.
ఇక నటిగా కెరియర్ కొనసాగించడం అనేది కాబోయే భర్త అభిప్రాయం బట్టి ఉంటుందని ఇప్పటికే ఆమె చెప్పినట్లు తెలుస్తుంది.