వెండితెర నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ పూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.శ్రీ మహాలక్ష్మి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె అనంతరం సీమటపాకాయ్, అవును వంటి సినిమాలలో నటించారు.
ఇలా పలు సినిమాలలో హీరోయిన్ గా నటించడమే కాకుండా బుల్లితెర కార్యక్రమాలకు న్యాయ నిర్నేతగా కూడా వ్యవహరించారు.ఇలా ప్రేక్షకులను సందడి చేస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న పూర్ణ గత ఏడాది దుబాయ్ కి చెందిన ఆసిఫ్ అలీ అనే ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
పూర్ణ తన కుటుంబ సభ్యుల సమక్షంలో దుబాయిలో తన వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు.ఇలా తన వివాహానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ఇక ఈమె ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తాను తల్లి కాబోతున్నాను అనే విషయాన్ని కూడా అభిమానులతో పంచుకున్నారు.
తాజాగా ఈమె సీమంతపు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.
ఈ విధంగా పూర్ణ తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఎంతో ఘనంగా తన సీమంతపు వేడుకలను జరుపుకున్నట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఈ ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.దీంతో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మరి కొద్ది రోజులలో పూర్ణ ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారని తెలియడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.