తెలుగు సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఒకటి, రెండు చిత్రాలలో హీరో,హీరోయిన్లుగా నటించి ఆ తర్వాత పెద్దగా సక్సెస్ కాలేకపోయినటువంటి నటీనటులు చాలా మందే సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు.కాగా తెలుగులో 2005వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు “కూచిపూడి వెంకట్” దర్శకత్వం వహించిన “మొదటి సినిమా” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన మలయాళ బ్యూటీ “పూనమ్ బజ్వా” కూడా ఈ కోవకే చెందుతోంది.
అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే తన అందం, అభినయం, నటన తో బాగా ఆకట్టుకోవడంతో ఏకంగా కింగ్ నాగార్జున, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తదితర స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుంది.కానీ దురదృష్టవశాత్తు ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.
దీంతో పూనమ్ బజ్వా కి హీరోయిన్ గా గుర్తింపు లభించలేదు.దాంతో తమిళ సినిమా పరిశ్రమకి వెళ్ళిపోయి అక్కడ బాగానే రాణించింది.
అయితే ఈ మధ్య కాలంలో అడపాదడపా చిత్రాలలో బాగానే ఆకట్టుకుంటున్న పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.అయితే తాజాగా ఈ అమ్మడు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసినటువంటి ఫోటోలు కారణంగా మరోమారు హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఇందులో అప్పుడే నిద్ర లేస్తూ ఒళ్ళు విరుచుకుంటూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.అయితే ఇందులో పూనమ్ బజ్వా నాభి అందాలను ఆరబోస్తూ కుర్రకారు మతి పోగొడుతోంది.
దీంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.అంతే కాకుండా ఈ ఫోటోలను షేర్ చేసిన అతికొద్ది సమయంలోనే దాదాపుగా 2.50 లక్షల పై చిలుకు మంది నెటిజన్లు లైక్ చేశారు.
ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో ఆమధ్య పూనమ్ బజ్వా “ఎన్టీఆర్ కథానాయకుడు” చిత్రంలో గరికపాటి లోకేశ్వరి పాత్రలో నటించింది.కానీ ఈ చిత్రం కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో ఈ అమ్మడికి గుర్తింపు లభించలేదు.కాగా ప్రస్తుతం ఈ అమ్మడికి టాలీవుడ్ సినిమా పరిశ్రమలో పెద్దగా అవకాశాలు లేవు.
కానీ మలయాళంలో ఎట్టకేలకు ప్రముఖ దర్శకుడు వినయన్ దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.