బుట్టబొమ్మ పూజ హెగ్దే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అక్కినేని నాగచైతన్యకు జంటగా 2014లో ఒక లైలా కోసం అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతుంది.
బుట్టబొమ్మ చేసిన దువ్వాడ జగన్నాథం, రంగస్థలం, అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్.రీసెంట్ గా వచ్చిన అలా వైకుంఠపురం సినిమాలు కూడా సూపర్ హిట్ అవ్వడంతో ప్రొడ్యూసర్లు సైతం పూజా హెగ్దే హీరోయిన్ అంటే బొమ్మ బ్లాక్ బాస్టర్ హిట్టేనని సెంటిమెంట్ గా ఫీలవుతున్నారు.
కరోనా కష్టకాలంలో ఆదే జోరు కంటిన్యూ అవ్వాలంటే ఈ టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ తమ సినిమాలో ఉండాల్సిందేనని పట్టుబడుతున్నారు.ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో పిరియాడిక్ లవ్ ఎంటర్ టైనర్ సినిమా గా రాధేశ్యామ్, అక్కినేని అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాల్లో యాక్ట్ చేస్తుంది.
వరుస సినిమాలు హిట్లు కావడంతో బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయని ఫిల్మింనగర్ వర్గాలు కోడై కూస్తున్నాయి.
దీనికితోడు రాధేశ్యామ్ చిత్రబృందం మాంచి మెలోడీతో విడుదల చేసిన మోషన్ పోస్టర్లో ఓ ట్రైన్.
ఆ ట్రైన్ లో ప్రభాస్, హెగ్డేలు అందరగొట్టారు.రాధేశ్యామ్ తో పాటు.
విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ స్టిల్ , టీజర్ లో రొమాంటిక్ టచ్ ఇచ్చాడు డైరక్టర్ బొమ్మరిల్లు భాస్కర్.ఈ చిత్ర టీజర్ యూత్ ను బాగా అట్రాక్ట్ చేయడంతో బుట్టబొమ్మ ఆనందంతో ఎగిరి గంతేస్తుంది.
ఈ స్వీట్ మూమెంట్ లో కొన్ని ఆసక్తిక విషయాల్ని బయటపెట్టింది ఈ అమ్మడు.
సాధారణంగా తెలుగు లాంగ్వేజ్ వచ్చినా కొంతమంది హీరోయిన్ లు తెలుగులో మాట్లాడేందుకు ఇష్టపడరు.
ఎందుకంటే ఆఫర్స్ రావేమోనని.కానీ ఈ టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే మాత్రం తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది.
లెర్నింగ్ కోసం ఎవరైనా కోచ్ ను పెట్టుకున్నారా అని అడిగితే అదేం లేదు.నా స్టాఫ్, మేనేజర్లతో తెలుగులో మాట్లాడుతున్నాను.
ముఖ్యంగా ఇంటర్వ్యూల్లో తెలుగులో మాట్లాడాలంటేనే నాకు భయం.ఎప్పటికైనా ఫ్లూయింట్ గా తెలుగులో మాట్లాడతానని నవ్వుతూ ఛాలెంజ్ చేసింది ఈ ముద్దుగుమ్మ.