టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే గురించి మనందరికీ తెలిసిందే.అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది.
అయితే ఎప్పటినుంచో ఉన్న పూజా హెగ్డే తాజాగా తన కల నెరవేర్చుకుంది.సొంత ఇంటిని నిర్మించుకోవాలి అన్న పూజ హెగ్డే కల నెరవేరింది.
ఈ నేపథ్యంలోనే ముంబైలో కొత్తగా ఒక ఇంటిని నిర్మించుకుంది పూజా హెగ్డే.తాజాగా శుక్రవారం రోజున గృహప్రవేశం కూడా చేసింది.
ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు చాలా ఆనందంగా ఉంది.
అంతేకాకుండా అమ్మాయిలకు ఆదర్శంగా నిలవాలి అనుకుంటున్నాను అని ఆమె తెలిపింది.
తన కష్టార్జితంతో ఇల్లు కట్టుకోవడం చెప్పలేనంత ఆనందంగా ఉంది అది ఒక అద్భుతమైన అనుభూతి అని ఆమె తెలిపింది.
అలాగే ముంబై, హైదరాబాద్, చెన్నై లాంటి ప్రదేశాలకు షూటింగ్ కోసం వెళుతూ ఉంటాను.అదేవిధంగా నా కెరీర్లో ఏదైనా సాధించాలనే కలను నెరవేర్చుకుంటూ వస్తున్నాను అని తెలిపింది.
ఈ నేపథ్యంలోనే హార్డ్ వర్క్ కూడా చేస్తున్నాము.ఇంత కష్టపడి సంపాదించిన డబ్బుతో ఒక సొంత ఇల్లు కట్టుకోవడం అన్నది మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది అని ఆమె తెలిపింది.
అలాగే కష్టపడితే మన కలల్ని ఆకాశం తప్పకుండా నెరవేరుతుంది.
ఎందుకంటే కలలు కనడానికి వయస్సుకు సంబంధం లేదు.ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిగా నా కలలను నెరవేర్చుకుంటున్నాను అని ఆమె తెలిపింది.కష్టం కలల్ని నెరవేర్చుతుందని అమ్మాయిలకు చెప్పాలి అనుకుంటున్నాను.
ఇక ఈ విషయంలో చిన్న పిల్లలకు కూడా ఆదర్శంగా నిలవాలి అనుకుంటున్నాను.అమ్మాయిలు మిమ్మల్ని మీరు నమ్మండి.
కలలు కనండి.మీరు కష్టపడి ఆ కల నెరవేర్చుకున్నప్పుడు ఒక వ్యాల్యూ ఉంటుంది అని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే.