సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలతో దూసుకు పోతుంది ముద్దుగుమ్మ పూజా హెగ్డే.తెలుగులో అల్లు అర్జున్ తో చేసిన అల వైకుంఠపురములో సినిమా హిట్ అవ్వడంతో ఈ బ్యూటీ కి మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టాయి.
ఈ సినిమా తర్వాత పూజా హెగ్డే ను బుట్ట బొమ్మగా అభివర్ణిస్తున్నారు.తాజాగా ఈ బుట్టబొమ్మ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
అవి కుర్రకారుకు తెగ నచ్చేసాయి.
ఈ ఫొటోల్లో పూజా హెగ్డే బుల్లి గౌను వేసుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.పూజా నీలం రంగు గౌను ధరించి స్టన్నింగ్ లుక్ తో అందరిని తన వైపుకు ఆకర్షించింది.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే.పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషలలో వరుస ఆఫర్లను అందుకుంటూ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉంది.
తెలుగులో రామ్ చరణ్ సరసన ఆచార్య సినిమాలో నటిస్తుంది.ఈ సినిమాలో కొద్దీ సేపు కనిపించినా పూజా పాత్ర కీలకంగా ఉండబోతుందని తెలుస్తుంది.
ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల కాబోతుంది.దీంతో పాటు ప్రభాస్ సరసన రాధేశ్యామ్ సినిమాలో కూడా నటిస్తుంది.
రాధేశ్యామ్ సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది.ఎట్టకేలకు ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు.ఇక తమిళ్ లో విజయ్ సరసన బీస్ట్ సినిమాలో కూడా ఈ బుట్టబొమ్మ నటిస్తుంది.
వీటితో పాటు బాలీవుడ్ లో రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ సరసన సర్కస్ సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మనే హీరోయిన్.ఈ సినిమా జులై 15, 2022 న విడుదల కాబోతుంది.