ఆర్.ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ లో పాయల్ రాజ్ పుత్ స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.అయితే తాజాగా పాయల్ ఎమోషనల్ అయ్యారు.తాను ప్రేమించే వ్యక్తి చనిపోయారంటూ ఆమె పోస్ట్ పెట్టారు.సౌరభ్ డింగ్రా పాయల్ ప్రియుడు అనే విషయం మనందరికీ తెలిసిందే.కరోనా బారిన పడి ఇప్పటికే ఎంతో మంది మృతి చెందగా సౌరభ్ డింగ్రా తల్లి అనిత కూడా కరోనా వైరస్ బారిన పడి మృతి చెందారు.
తను ఇష్టపడే వ్యక్తి తల్లి చనిపోవడంతో పాయల్ కన్నీటి పర్యంతమయ్యారు.అనితా ఆంటీ తన పక్కన లేకపోయినా తన హృదయంలో ఉంటారని పాయల్ అన్నారు.ఆంటీని మిస్ అవుతున్నామని కరోనాను జయించడానికి ఆంటీ ఎంతో పోరాడారని పాయల్ పేర్కొన్నారు.అమ్మ ఏ విధంగా గారాబం చేస్తుందో అనితా ఆంటీ కూడా అదే విధంగా గారాబం చేసేవారని తాను ప్రేమించే వ్యక్తి చనిపోయారని పాయల్ వెల్లడించారు.
తనపై అనితా ఆంటీ ఎంతో ప్రేమను చూపించేవారని ఆంటీని వెనక్కు తీసుకురావాలని ఉన్నా ఆ అవకాశం లేదని పాయల్ పేర్కొన్నారు.
తనకు ఛాన్స్ వస్తే కరోనా వైరస్ ను అంతం చేస్తానని అనితా ఆంటీ చివరిసారిగా తనకు ఊపిరాడటం లేదని చెప్పిందని పాయల్ తెలిపారు.కొన్ని రోజుల క్రితం సౌరభ్ తల్లి అనితకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.అయితే పరిస్థితి విషమించడంతో ఆమె చనిపోయారు.
కరోనా వైరస్ బారిన పడి ఎంతోమంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు చనిపోతున్న సంగతి తెలిసిందే.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులు సైతం వైరస్ బారిన పడ్డారు.
ఈ మధ్యకాలంలో బన్నీ, పవన్, ఎన్టీఆర్ కరోనా బారిన పడగా పవన్, బన్నీ వైరస్ నుంచి కోలుకున్నారు.ఎన్టీఆర్ కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడగా ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని తెలుస్తోంది.