కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం డ్రగ్స్ కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.ఈ కేసులో డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో హీరోయిన్స్ రాగిణి ద్వివేది, సంజన గాల్రాని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
అయితే ఈ విచారణకి సంబందించిన వీడియోలు బయటకి వచ్చాయి.వీటిని సోషల్ మీడియాలో ఎవరో షేర్ చేయడం వలన వైరల్ అయ్యాయి.
ఇదిలా ఉంటే నిజానికి నిందితులని విచారణకి సంబందించిన ప్రతి అంశం పోలీసులు చాలా గోప్యంగా ఉంచుతారు.అయితే హీరోయిన్స్ విచారణ వీడియో బయటకి లీక్ కావడంపై ఇప్పుడు కొంత మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వారిలో కన్నడ హీరోయిన్ పరుల్ యాదవ్ కూడా చేరింది.
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినా హీరోయిన్స్ కి సంబందించిన వీడియోలు, విచారిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వాటిని లేడీ కానిస్టేబుల్స్ షూట్ చేసినట్లుగా క్లీయర్ గా తెలుస్తుంది అంటూ హీరోయిన్ పరూల్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.దేశంలో ఒక వైపు లక్షల్లో పెరుగుతున్న కరోనా కేసులు, మరో వైపు చైనా ఆగడాలు, ఆర్థిక వ్యవస్థ అస్థవ్యస్థం అవ్వడం వంటి అతి పెద్ద సమస్యలు ఉన్నాయి.
ఇలాంటి సమయంలో డ్రగ్స్ కేసును దేశ విపత్తు అన్నట్లుగా మీడియా మరియు కొందరు ఫోకస్ చేస్తున్నారు అంటూ పరూల్ యాదవ్ అసహనం వ్యక్తం చేసింది.డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి ఇంకా వారి కేసు నిర్థారణ కాకుండానే వారి వీడియోలను లీక్ చేయడం ద్వారా వారి జీవితాలను నాశనం చేసినట్లే అంటూ ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది.
ప్రస్తుతం డ్రగ్స్ కేసులో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే దేశంలో ఉన్న ఇతర పెద్ద సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నంలో భాగంగానే జరుగుతున్నట్లు కనిపిస్తుందని పరుల్ యాదవ్ అనుమానం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది.