ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తో్న్న సంగతి తెలిసిందే.ఈ మహమ్మారి బారిన పడకుండా అందరూ ఇళ్లకే పరిమితం కావాలని దేశవ్యాప్తంగా లాక్ డౌన్ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.
ఇక ఈ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు.కాగా అందరూ తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని అధికారులు సూచించారు.
సెలబ్రిటీలు కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇళ్లకే పరిమితం అయ్యారు.
అయితే కొందరు మాత్రం కరోనా వైరస్ అంటే లెక్క చేయడం లేదు.
తాజాగా ఓ నటి చేసిన పని నెటిజన్ల ఆగ్రహానికి గురైంది.బుల్లితెర ‘నందిని’ సీరియల్ హీరోయిన్ నిత్యా రామ్ తన భర్తతో మాస్క్ వేసుకుని ముద్దు పెట్టుకకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దీంతో నెటిజన్లు ఆమెను దుమ్మెత్తిపోస్తున్నారు.
దేశమంతా కరోనా వైరస్తో భయపడుతుంటే, మీకు ముద్దులు కావాలా అంటూ వారిపై మండిపడుతున్నారు.
మొత్తానికి కరోనా పుణ్యమా అని ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు పాపులర్ కావాలని చూస్తు్న్నారు.కానీ పాపులర్ అయ్యేందుకు ఇది సరైన సమయమా అని ఒక్కసారి ఆలోచించాల్సిందిగా పలువురు కోరుతున్నారు.