బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ లో జయలలిత బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో సుమారు వంద కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది.
ఇప్పటికే మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయిపొయింది.లాక్ డౌన్ పరిస్థితుల వలన ప్రస్తుతం వాయిదా పడింది.
ఇక ఈ సినిమాలో నటిస్తున్న కంగనా రనౌత్ పై తమిన నటి వివాదాస్పద హీరోయిన్ మీరా మిథున్ ఘాటు వాఖ్యలు చేసింది. సుశాంత్ మరణం నేపధ్యంలో బాలీవుడ్ లో నెపోటిజం గురించి కంగనా తీవ్ర విమర్శలు చేసింది.
ఈ నేపధ్యంలో మీరా మిథున్ కంగనా మీద విరుచుకుపడింది.
తమిళ ఇండస్ట్రీలో నేను కూడా నెపోటిజం బాధితురాలినే అని ట్వీట్ చేసిన మీరా దానికి కారణం కంగనాలాంటి పరాయి బాష నటీమణులు అని పేర్కొంది.
జయలలిత బయోపిక్లో నటించడానికి కంగనాకి ఏం అర్హత ఉంది.ఏం చూసి ఆమెని ఎంపిక చేసుకున్నారు అని ప్రశ్నించింది.కోలీవుడ్లో నడుస్తున్న రాజకీయాలే దీనికి ప్రధాన కారణం అని మీరా వాఖ్యానించింది.నా రాష్ట్ర సీఎం పాత్రలో పోషించడానికి నువ్వు అనర్హురాలివి.
షేమ్ ఫర్ మై లేట్ బిలవుడ్ సీఎం అంటూ కంగనాపై మీరా మిథున్ నిప్పులు చెరిగింది.మరి మీరా వాఖ్యలని కంగనా లైట్ తీసుకుంటుందా లేదంటే సమాధానం ఇస్తుందా అనేది వేచి చూడాలి.