మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు.గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమాని ప్రస్తుతం పూర్తి చేసే పనిలో ఉన్నాడు.
ఈ సినిమా తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.అలాగే త్రినాథ్ రావు నక్కిన, మారుతి దర్శకత్వంలో కూడా సినిమాలు లైన్ లో పెట్టాడు.
ఈ సినిమాలు అన్ని కూడా వచ్చే ఏడాది సెట్స్ పైకి వరుసగా వెళ్లే అవకాశం ఉంది.వీటిలో రమేష్ వర్మ దర్శకత్వంలో తమిళ మూవీ చతురంగ వెట్టై 2 రీమేక్ చేయబోతున్నాడు.
ఇక ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్, క్యాస్టింగ్ సెలక్షన్ ప్రస్తుతం జరుగుతుంది.ఇందులో హీరోయిన్స్ గా ముందు నిధి అగర్వాల్, సీరత్ కపూర్ ని అనుకున్నారు.
అయితే ఇప్పుడు నిధి అగర్వాల్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది.వేరే సినిమాలకి డేట్స్ ఇచ్చేయడంతో ఈ సినిమాకి అడ్జస్ట్ చేయలేక తప్పుకుందని సమాచారం.
ఈ నేపధ్యంలో నిధి అగర్వాల్ ప్లేస్ లో కొత్త హీరోయిన్ తీసుకున్నట్లు తెలుస్తుంది.
నిధి తప్పుకోవడంతో ఆ స్థానంలో మీనాక్షి చౌదరిని హీరోయిన్ గా ఖరారు చేసినట్లు తెలుస్తుంది.
మిస్ ఇండియా పోటీలలో పాల్గొని ఫస్ట్ రన్నరప్ గా నిలిచిన ఈ అందాల భామ ముందుగా అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వెబ్ సిరీస్ ద్వారా నటిగా తెరంగేట్రం చేసింది.తెలుగులో అక్కినేని ఫామిలీ హీరో సుశాంత్ కి జోడీగా ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
ఇప్పుడు రెండో సినిమానే ఏకంగా రవితేజతో జత కట్టే అవకాశాన్ని ఈ హర్యానా సుందరి సొంతం చేసుకుంది.టాలీవుడ్ లో ఈ అమ్మడు ఛరిష్మా ఎంత ఫేమ్ ఇస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
.