తెలుగు, తమిళంలో ఎన్నో చిత్రాల్లో నటించిన ప్రముఖ నటి మనోరమ తుది శ్వాస విడిచారు.78 సంవత్సరాల మనోరమ ఎన్నో అవార్డులు, రివార్డులను అందుకున్నారు.గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న మనోరమ చెన్నైలోని ప్రముఖ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.అదే సమయంలో ఆమెకు గుండె పోటు రావడంతో మనోరమ కన్నుమూసినట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం పొందిన మనోరమ మరెన్నో బిరుధులను కూడా దక్కించుకున్నారు.తెలుగులో ఈమె ‘శుభోదయం’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు.ఆ చిత్రం 1980వ సంవత్సరంలో వచ్చింది.అప్పటి నుండి కూడా తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలిగా మారిపోయారు.
మనోరమ చివరిగా సూర్య హీరోగా తెరకెక్కిన ‘సింగం 2’ చిత్రంలో నటించారు.తెలుగులో ఈమె నటించక చాలా సంవత్సరాలు అయ్యింది.
ఈమెకు ఒక కుమారుడు ఉన్నాడు.మనోరమ మృతితో తెలుగు మరియు తమిళ సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.