యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు.దీని తర్వాత ఆది పురుష్ సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్తాడు.
ఆ సినిమా ఓ మూడు నెలల్లో పూర్తి చేసి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సైన్స్ ఫిక్షన్ మూవీ షూటింగ్ కి జాయిన్ అవుతాడు.ఈ లోపే నాగ్ అశ్విన్ కూడా ఆ సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.
ఏకంగా 450 కోట్ల భారీ బడ్జెట్ తో యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సైన్స్ ఫిక్షన్ కథాంశంతో డార్లింగ్ తో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్విని దత్ సినిమాని నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే మెయిన్ హీరోయిన్ గా చేస్తుంది.
ఈ సినిమా కోసం ఏకంగా 12 కోట్లు రెమ్యునరేషన్ ని ఆమె తీసుకుంటుందని తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఉందని తెలుస్తుంది.
మళయాళ బ్యూటీ మాళవికా నాయర్ ఈ సినిమాలో సెకండ్ లీడ్ హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యిందని టాక్.
అయితే ఈ విషయాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ అధికారికంగా కన్ఫర్మ్ చేయకున్న వైజయంతీ మూవీస్ తాజాగా మాళవికా నాయర్ కి పుట్టినరోజు విషెస్ చెబుతూ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది.
నిజానికి హీరోయిన్లుకి నిర్మాణ సంస్థలు ఎప్పుడూ పుట్టినరోజు విషెస్ ప్రత్యేకంగా చెప్పవు.ఒక వేళ చెప్పాయంటే కచ్చితంగా వారి ప్రొడక్షన్ లో ఏదో ఒక సినిమా ఆమె చేయబోతోందని అర్ధం.
మాళవికా నాయర్ గతంలో కల్యాణ వైభోగమే, మహానటి సినిమాలో నటించింది.ఈ రెండు సినిమాలు వైజయంతీ మూవీస్ పై స్వప్నాదత్ నిర్మించింది.అయితే ఇప్పుడు ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి కేవలం ప్రభాస్ సినిమా మాత్రమే రాబోతుంది.దీనిని బట్టి ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం అయినా లేదంటే సెకండ్ లీడ్ గా మాళవికా నాయర్ ని ఖరారు చేసినట్లు అర్ధమవుతుంది.