బాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోయిన్లలో మహిమా చౌదరి కూడా ఒకరనే సంగతి తెలిసిందే.తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మహిమా చౌదరి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
గతంలో సినిమా ఇండస్ట్రీ కన్యలను మాత్రమే కోరుకునేదని ఆమె చెప్పుకొచ్చారు.గతంలో హీరోయిన్ ఎవరితో అయినా డేటింగ్ లో ఉన్నా లేదా పెళ్లి చేసుకున్నా ఆయా హీరోయిన్లకు అవకాశాలు తగ్గేవని మహిమా చౌదరి చెప్పుకొచ్చారు.
అయితే కాలంలో పాటే పరిస్థితులు కూడా మారాయని మహిమా చౌదరి అన్నారు.ప్రేక్షకులు ప్రస్తుతం మహిళా నటులను సైతం విభిన్నమైన పాత్రలలో ఆదరిస్తున్నారని ఆమె కామెంట్లు చేశారు.
పది సంవత్సరాల క్రితం నాటి పరిస్థితులతో పోల్చి చూస్తే ప్రస్తుతం ఫిమేల్ యాక్టర్లు మంచి స్థాయిలో ఉన్నారని మహిమా చౌదరి పేర్కొన్నారు.ప్రస్తుతం మహిళలు శక్తివంతమైన స్థితిలో ఉన్నారని గతంతో పోలిస్తే మెరుగైన జీవితాన్ని మహిళలు కలిగి ఉన్నారని మహిమా చౌదరి చెప్పుకొచ్చారు.
మహిళలకు మెరుగైన పారితోషికంతో పాటు మంచి వేతనం లభిస్తున్నాయని మహిమా చౌదరి అన్నారు.
పర్దేస్ అనే సినిమా ద్వారా మహిమా చౌదరి నటిగా తన కెరీర్ ను మొదలుపెట్టారు.పర్దేస్ సినిమాకు సుభాష్ ఘని దర్శకత్వం వహించగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు భారీ సక్సెస్ ను సొంతం చేసుకుంది.అవకాశాలు తగ్గిన తర్వాత మహిమా చౌదరి 2006 సంవత్సరంలో బాబీ ముఖర్జీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.
2007 సంవత్సరంలో బాబీ ముఖర్జీ మహిమా చౌదరి దంపతులకు కూతురు పుట్టగా ఆ కూతురుకు అరియానా అని పేరు పెట్టారు.2013 సంవత్సరంలో వేర్వేరు కారణాల వల్ల మహిమ బాబీ విడాకులు తీసుకున్నారు.మహిమా చౌదరికి ఈ మధ్య కాలంలో సినిమా ఆఫర్లు రావడం లేదు.అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ మహిమ తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.