సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీలు పెద్ద ఎత్తున డబ్బులు సంపాదిస్తూ వాటిని ఆస్తిపాస్తులపై పెట్టుబడిగా పెడుతుంటారు.ఈ క్రమంలోనే ఎంతోమంది ఖరీదైన ల్యాండ్ కొనుగోలు చేస్తూ పెట్టుబడులు పెట్టడం మరికొందరు అపార్ట్మెంట్లను కొనుగోలు చేస్తూ ఉంటారు.
అయితే బాలీవుడ్ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ఇలా అపార్ట్మెంట్లను కొనుగోలు చేస్తుంటారు.ఇక వాటికి మంచి బేరం కుదిరినప్పుడు వాటిని అమ్ముతూ లాభం పొందుతుంటారు.
ఇకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి మాధురి దీక్షిత్ సైతం తాజాగా ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు.ఈమె ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతంలో విలాసవంతమైన ఇల్లు కొనుగోలు చేశారని బీ టౌన్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈమె 53వ అంతస్తులు ఈ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారని సమాచారం.ఇక ఈ ఇంటిని మాధురి దీక్షిత్ ఏకంగా 48 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేశారని వార్తలు వస్తున్నాయి.
ఇలా ఎంతో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినటువంటి ఈమె ఈ ఇంటిలో జిమ్, స్పా, స్విమ్మింగ్ పూల్, ఫుట్ బాల్ పిచ్, క్లబ్ వంటి ఎన్నో సదుపాయాలతో ఈ ఇంటిని నిర్మించారని తెలుస్తుంది.అయితే ఇప్పటికే ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులను కూడా పూర్తి చేసినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఇలా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఖరీదైన ఆస్తుపాస్తులను కొనుగోలు చేయగా తాజాగా మాధురి దీక్షిత్ సైతం ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు.