నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆర్.నారాయణ మూర్తి ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.
విప్లవ ప్రధానమైన సినిమాల ద్వారా ఆయన పాపులారిటీని పెంచుకోవడం గమనార్హం.తూర్పుగోదావరి జిల్లాలోని మల్లంపేట గ్రామంలోని పేదరైతు కుటుంబంలో ఆయన జన్మించారు.
బాల్యంలో నారాయణమూర్తి సినిమాలలో హీరో కావాలని అనుకున్నారు.నిజ జీవితంలో ఆయన ఎన్నో సినిమా కష్టాలను అనుభవించారు.
నేరము శిక్ష సినిమాలో నారాయణమూర్తి జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలో కనిపించి మెప్పించారు.ఆ తర్వాత రోజుల్లో హీరో కావాలంటే మొదట దర్శకునిగా నిలదొక్కుకోవాలని భావించి ఆయన దర్శకుడిగా మారారు.అర్ధరాత్రి స్వతంత్రం అనే సినిమాను దర్శకునిగా నారాయణమూర్తి మొదలుపెట్టగా ఈ సినిమా 16.5 లక్షల రూపాయల పెట్టుబడితో పూర్తైంది.జయాపజయాలతో సంబంధం లేకుండా నారాయణమూర్తి కెరీర్ ను కొనసాగించారు.
ప్రముఖ సినీ నటి మాధవి రెడ్డి నారాయణమూర్తి గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాను మంచిమంచి సినిమాలలో నటించానని ఆమె చెప్పుకొచ్చారు.రెండు సినిమాలలో తాను హీరోయిన్ గా చేశానని ఆమె తెలిపారు.
మార్కెట్ లో ప్రజాస్వామ్యం సినిమాలో నారాయణమూర్తితో కలిసి చేశానని ఆమె చెప్పుకొచ్చారు.నెలరోజులు డేట్లు ఇస్తే మాత్రమే సినిమాలోకి తీసుకుంటానని ఆయన చెప్పారని ఆమె వెల్లడించారు.
నారాయణమూర్తికి కోపం ఎక్కువని ఎవరైనా సరిగ్గా చేయకపోతే ఆయన కొడతారని ఆమె వెల్లడించారు.ఆయన దగ్గర స్క్రిప్ట్ అనేది ఉండదని నేను ఏది చెప్పానో అది నువ్వు చెయ్యాలని ఆయన చెప్పేవారని ఆమె కామెంట్లు చేశారు.నారాయణమూర్తి గారి షూటింగ్ లో ఎక్కువగా మాట్లాడకూడదని ఆమె చెప్పుకొచ్చారు.ఒక్కడున్నాడు, మజిలీ సినిమాలలో తాను నటించానని ఆమె తెలిపారు.ఇప్పటి హీరోయిన్లకు యాక్టింగ్ రాదని బయట టాక్ ఉందని అయితే సమంత మాత్రం బాగా చేసిందని ఆమె చెప్పుకొచ్చారు.