టాలీవుడ్లోకి నచ్చావులే అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నటువంటి హీరోయిన్ మాధవీ లత గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు చేతిలో పెద్దగా సినిమా అవకాశాలు లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులకు నిత్యం అందుబాటులోనే ఉంటుంది.
అంతేకాక ఈ మధ్య కాలంలో సమాజానికి సంబంధించినటువంటి పలు సమస్యలపై స్పందిస్తూ వాటిని హైలెట్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది.
అయితే ఇటీవల కాలంలో దేశంలో మహమ్మారి కరోనా వైరస్ ప్రబలుతున్న విషయం అందరికీ తెలిసిందే.
దీంతో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా రేపటి రోజున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు దేశంలోని ప్రజలందరూ అందరూ బాద్యతాయుతంగా “జనతా కర్ఫ్యూ” పాటించాలని పిలుపునిచ్చారు.అయితే ఈ విషయంపై తాజాగా హీరోయిన్ మాధవీ లత తన అధికారిక ఫేస్బుక్ ఖాతా ద్వారా స్పందించింది.
ఇందులో భాగంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చినటువంటి జనతా కర్ఫ్యూలో తాను కూడా పాల్గొంటున్నారని, అంతేకాక మీరు కూడా పాల్గొనాలని అంటూ తన అభిమానులకు సూచించింది.అలాగే అసలు ఈ జనతా కర్ఫ్యూ అంటే ఏమిటి, ఈ జత కలిపి పాటించడం వల్ల ఉపయోగాలు ఏమిటో కూడా తెలిపింది.
అయితే మాధవి లతా ప్రస్తుతం రాష్ట్రంలోని బిజెపి పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటోంది.అందువల్ల ఈ అమ్మడు కొత్తగా సినిమాలకి ఓకే చెప్పనట్లు తెలుస్తోంది.