తెలుగు, తమిళ్ చిత్ర పరిశ్రమలకు సంబంధించి సీనియర్ నటి ఖుష్బూ కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ నుండి భారతీయ జనతా పార్టీకి మారిన సంగతి తెలిసిందే.ఈ వరకు రోడ్డు ప్రమాదం జరిగింది.
అయితే అదృష్టం కొద్దీ ఈవిడకు ఎలాంటి గాయాల పాలవకుండా సురక్షితంగా బయటపడింది.ఆవిడ ప్రయాణిస్తున్న కార్ ను ఓ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది.
తమిళనాడు రాష్ట్రంలోని మేల్ మరువత్తూర్ వద్ద ఈ సంఘటన జరిగింది.
ప్రాణాపాయం నుండి ఆవిడ తృటిలో తప్పించుకుంది.
ఈ సంఘటనలో కుష్బూ ప్రయాణిస్తున్న కారుకు ఓ టాంకర్ అడ్డంగా రావడంతో ఈ ప్రమాదం సంభవించింది.ఈ సంఘటనలో ఖుష్బూ ప్రయాణిస్తున్న కారు పక్క భాగం నుజ్జు నుజ్జు అయ్యింది.
ఇంత పెద్ద ఈ సంఘటన జరిగినా కానీ కుష్బూ సురక్షితంగా బయటపడడంతో ఇటు సిని, రాజకీయ వర్గాలు గెలుచుకున్నాయి.
ఇకపోతే ఈ సంఘటన గురించి తన సోషల్ మీడియా ద్వారా ప్రమాదం సంబంధించి తాను తృటిలో తప్పించుకున్న అని తెలుపుతూ ఆ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలను ఆవిడ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.తనకి అందరి అభిమానం, దేవుని ఆశీస్సులతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాను అని తెలియజేశారు.ఈ సంఘటనకు సంబంధించి తమిళనాడు రాష్ట్ర పోలీసులు పూర్తి దర్యాప్తు చేపడుతున్నారు.