ప్రముఖ సినీనటి, డైరెక్టర్ సుందర్ భార్య ఖుష్బూ సుందర్ నిన్న కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక కంటైనర్ ఆమె కారును ఢీ కొట్టిన సంగతి తెలిసిందే.ప్రమాదం జరిగిన సమయంలో కారులోని ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ఖుష్బూ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
ప్రమాదంలో ఖుష్బూ కారు నుజ్జునుజ్జైంది.అయితే తాజాగా ఖుష్భూ తనను చంపడానికి కుట్ర చేశారంటూ కారు ప్రమాదం గురించి ఘాటుగా స్పందించారు.
తనను హత్య చేయడానికి పథకం ప్రకారమే యాక్సిడెంట్ జరిగేలా చేశారని ఖుష్బూ అన్నారు.పోలీసుల పూర్తి దర్యాప్తు తరువాతే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఖుష్బూ చెప్పారు.బీజేపీ పార్టీలో చేరిన రోజు నుంచి తనకు బెదిరింపులు ఎక్కువయ్యాయని.ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనని ఖుష్బూ తెలిపారు.
ఇది ప్రమాదమైతే కాదని తాను ఖచ్చితంగా చెప్పగలనని ఖుష్బూ వెల్లడించారు.
కడలూరు ప్రాంతంలో జరుగుతున్న్ వేల్ యాత్రకు ఖుష్బూ చెన్నై తిరుచ్చి జాతీయ రహదారిపై వెళుతుండగా మధురాంతకం దగ్గర కంటైనర్ ఢీ కొట్టింది.మధురాంతకం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ఖుష్బూను ఇప్పటికే విచారించారు.మరోవైపు ఈ ప్రమాదంపై నెటిజన్లు సైతం అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
ఖుష్బూ కారును ఢీ కొట్టిన కంటైనర్ రాంగ్ రూట్లో వచ్చిందని సమాచారం.
పోలీసులు ప్రమాదానికి కారణమైన కంటైనర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
వాషింగ్ మెషీన్లను లోడ్ చేసుకుని కంటైనర్ పుదుచ్చేరి వైపు వెళుతోందని సమాచారం.డ్రైవర్ నోరు మెదిపితే మాత్రమే కారు యాక్సిడెంట్ ప్రమాదమా.? ప్రమాదం కాదా.? అనే విషయాలు తెలుస్తాయి.అయితే కారు ప్రమాదంలో ఖుష్బూకు ఎటువంటి గాయాలు కాలేదు.కొన్ని నెలల క్రితం ఖుష్బూ బీజేపీ పార్టీలో చేరగా రాజకీయాల్లోకి రావడం వల్లే ఖుష్బూ కారుకు యాక్సి్డెంట్ జరిగిందా.? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.