స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం దేశంలోని ప్రేక్షకులందరికీ సుపరిచితం కాగా ప్రభాస్ సినిమాల కొరకు టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో బాలీవుడ్ ప్రేక్షకులు కూడా అదే స్థాయిలో ఎదురు చూస్తుండటం గమనార్హం.ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలలో ఆదిపురుష్ కూడా ఒకటి కాగా ఈ సినిమాలో సీత పాత్రలో కృతిసనన్ నటిస్తున్నారు.
అయితే తాజాగా కృతిసనన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు.
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న కృతిసనన్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ చాలామంది ప్రభాస్ కు మొహమాటం ఎక్కువని చెబుతారని అయితే ప్రభాస్ తో పరిచయమైన తర్వాత అతను మొహమాటస్తుడని జరిగిన ప్రచారం నిజం కాదని అర్థమైందని కృతిసనన్ చెప్పుకొచ్చారు. ప్రభాస్ తనతో బాగా కలిసిపోయారని బయట చెప్పిన దానికి విరుద్ధంగా జరుగుతోందని కృతి అన్నారు.
ఫస్ట్ టైమ్ ప్రభాస్ తో పరిచయమైనప్పుడు హాయ్ అని మొహమాటంగా చెప్పారని కానీ రియల్ లైఫ్ లో మాత్రం పూర్తి భిన్నంగా జరుగుతోందని ఆమె అన్నారు.ప్రభాస్ చాలా సరదాగా ఉంటారని మంచి మాటకారి అని కృతి సనన్ అన్నారు.తను ఫుడ్ ను బాగా ఇష్టపడతానని ప్రభాస్ కూడా ఫుడ్ ను బాగా ఇష్టపడతారని ఇద్దరి మధ్య ఉన్న కామన్ పాయింట్ ఇదేనని ఆమె వెల్లడించారు.
బహుశా ఫుడ్ తనను, ప్రభాస్ ను దగ్గర చేసి ఉండవచ్చని కృతిసనన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతుండగా వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది.ఈ సినిమాలో రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.