మహేష్ బాబు హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన 1 నేనొక్కడినే సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమా సక్సెస్ కాకపోయినా కృతిసనన్ నటనకు మంచి పేరు వచ్చింది.
ఆ తరువాత కృతిసనన్ దోచెయ్ సినిమాలో నటించగా ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.తెలుగులో హీరోయిన్ గా నటించిన సినిమలు ఫ్లాప్ కావడంతో టాలెంట్ ఉన్నా కృతిసనన్ టాలీవుడ్ కు దూరమైంది.
ప్రస్తుతం కృతిసనన్ హిందీలో బచ్చన్ పాండే అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాలో స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు.సోషల్ మీడియాలో భారీ సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న కృతిసనన్ అప్పుడప్పుడూ కవితలు రాసి ఆ కవితలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు.
తాజాగా కృతిసనన్ తన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు ఆ ఫోటో కింద ఆసక్తికరమైన కవితను పోస్ట్ చేశారు.
” ఆమె కళ్లు లోతైనవి.నిజాయితీతో కూడుకున్నవి.ఆ కళ్లు ఎప్పటికీ మారవు.
ఆమె అలాంటి ప్రేమ కొరకు ఎదురు చూస్తోంది” అంటూ కృతిసనన్ తను రాసిన కవితను పోస్ట్ చేశారు.కృతిసనన్ చేసిన ఈ ఫోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా ఆమె కవితకు 9 లక్షలకు పైగా లైకులు రావడం గమనార్హం.
నటిగా ఇప్పటికే తనను తాను ప్రూవ్ చేసుకున్న కృతిసనన్ కవయిత్రిగా కూడా ప్రూవ్ చేసుకుంటూ ఉండటం గమనార్హం.
కృతిసనన్ లో ఉన్న ఈ టాలెంట్ ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
కృతిసనన్ కవితలు అద్భుతంగా ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.కొన్నేళ్ల క్రితం కృతిసనన్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో డేటింగ్ చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.