టాలీవుడ్ యంగ్ రెబల్ మరియు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాల్లో బిజీగా ఉన్నాడు.ప్రస్తుతం ప్రభాస్ యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న రాధే శ్యామ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
అంతేకాకుండా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా, ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమా లో బిజీగా ఉన్నాడు.ఇదిలా ఉంటే మరో స్టార్ దర్శకుడు నాగ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు.
ఇక ప్రభాస్ ప్రస్తుతం ఆది పురుష్ అనే పాన్ ఇండియా సినిమా లో బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో నటిస్తున్నాడు.ఈ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కనుంది.
ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు.సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలో నటించనున్నాడు.
ఇక బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ లంకేష్ పాత్రలో నటిస్తున్నాడు.ఇక ఇందులో సీత పాత్ర గురించి హీరోయిన్ కోసం కొన్ని రోజులు చర్చ జరగగా.ఇటీవలే నటి కృతీ సనన్ సీత పాత్రలో నటించనుంది.ఇదిలా ఉంటే ఈ పాత్ర పెద్ద బాధ్యత అంటూ కృతీ చెప్పుకొచ్చింది.
డైరెక్టర్ ఓం రౌత్, ప్రభాస్ లను ఆది పురుష్ కుటుంబం సోమవారం ఆహ్వానించారు.ఇక ఇందులో హీరోయిన్ కృతీ కొన్ని విషయాలు మాట్లాడుతూ.కొత్త ప్రయాణం మొదలైందంటూ.ఈ సినిమాలో ఓ భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉందని.ఎంతో ప్రత్యేకమైన చిత్రాల్లో ఇదొకటి అని తెలిపింది.ఇక సీత గా నటించడం పెద్ద బాధ్యత అంటూ చెప్పుకొచ్చింది.
అంతేకాకుండా ప్రతిభావంతులైన వ్యక్తులతో పనిచేస్తున్నానని, కాబట్టి హార్డ్ వర్క్ చేయడంతోపాటు తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తానంటూ.మిగతాది డైరెక్టర్ కు, అతని అద్భుత సృష్టికి వదిలేస్తానంటూ చెప్పుకొచ్చింది.