గత ఏడాది కరోనా సమయంలో చాలా సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలైన సంగతి తెలిసిందే.థియేటర్లు తెర్చుకోక ముందు చాలా వరకు ఏమి చేయలేని స్థితిలో సినిమాలు ఓటీటీ లో విడుదలకు ముందుకు వచ్చారు సినీ నిర్మాతలు.
కొంతవరకు మంచి విజయాలను సాధించగా.మరికొన్ని సినిమాలు అంతగా హిట్ సాధించలేకపోయాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓ నటి ఓటీటీ లో నటించడానికి ఆసక్తి చూపుతుంది.
టాలీవుడ్ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే సినిమాలో హీరోయిన్ నటించిన కృతి సనన్.
ఆ సినిమాలో తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.ఆ తరువాత దోచేయ్ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మకు ఈ సినిమాతో అంతా గుర్తింపు లేక పోయేసరికి.
బాలీవుడ్ లో అడుగు పెట్టింది.తన నటనతో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ సినిమాలలో విజయాన్ని సాధించలేకపోయింది.
ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఓటీటీ విడుదలయ్యే సినిమాలలో నటించాలని ఆసక్తి చూపుతుంది.లాక్ డౌన్ సమయంలో ఎన్నో సినిమాలు ఓటీటీ లో విడుదలైన నేపథ్యంలో తాజాగా కృతి సనన్ ఓటీటీ వేదిక గురించి కొన్ని విషయాలు మాట్లాడుతూ.ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఏదైనా విడుదలయ్యే సినిమాలో నటించాలనే ఆసక్తి ఉందని తెలిపింది.ఇంతకు ముందు తాను సినిమాలలో చేయని పాత్రలలో నటించాలని ఉందంటూ మనసులో మాటను తెలిపింది.
అంతేకాకుండా తాను ఓటీటీ లో విడుదలైన సినిమాలన్నింటిని చూసి చాలా ఎంజాయ్ చేశానంటూ తెలిపింది.అంతేకాకుండా ఏదైనా కొత్తదనం కనిపించే పాత్రలో నటించాలని ఎదురు చూస్తోందట.బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాలనే ఆలోచన లేకుండా.ఏ సినిమా ఏ పాత్ర తో తీయాలి అనుకుంటున్నారో అదే పాత్రతో ఓటీటీ లో రూపొందించుకోవచ్చు అంటూ కృతిసనన్ చెప్పుకొచ్చింది.