టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన కృతిశెట్టికి( krithi shetty ) వరుసగా భారీ షాకులు తగులుతున్నాయి.ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
మరోవైపు ఉప్పెన సినిమాకు, ఇప్పటికీ కృతిశెట్టి ఫేస్ చాలా మారిపోయింది.ఆమె ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారంటూ ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
ఈ వార్తలు కృతి అభిమానులను ఒకింత కంగారు పెట్టాయి.
అయితే ఈ ప్లాస్టిక్ సర్జరీ కామెంట్లు తన దృష్టికి రావడంతో కృతిశెట్టి స్పందించి తనదైన శైలిలో జవాబిచ్చారు.
తన గురించి వైరల్ అవుతున్న రూమర్లను ఎవరు రాస్తున్నారో ఎందుకు రాస్తున్నారో అర్థం కావడం లేదని ఆమె అన్నారు.మాకు కూడా కుటుంబాలు ఉంటాయని ఇలాంటి రూమర్లు విన్న సమయంలో చాలా ఇబ్బందిగా అనిపిస్తుందని కృతిశెట్టి చెప్పుకొచ్చారు.
ఉప్పెన( Uppena )లో కనిపించిన విధంగా ఇప్పుడు కనిపించడం లేదని అంటున్నారని ఆమె తెలిపారు.
హెయిర్ స్టైల్ లో మార్పుల వల్ల కూడా కొన్నిసార్లు ఫేస్ కొత్తగా కనిపించే అవకాశం అయితే ఉందని కృతిశెట్టి పేర్కొన్నారు.ఫీచర్స్ అనేవి మారతాయని కృతి అభిప్రాయం వ్యక్తం చేశారు.కొన్ని సందర్భాల్లో మేకప్ వల్ల కూడా కొత్తగా కనిపిస్తామని అలా కనిపించినంత మాత్రాన ప్లాస్టిక్ సర్జరీ అనేస్తారా అని ఆమె చెప్పుకొచ్చారు.వైరల్ అయిన కామెంట్ల వల్ల కృతి హర్ట్ అయ్యారని ఫ్యాన్స్ చెబుతున్నారు.
కృతిశెట్టి ప్రస్తుతం పరిమితంగా రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారు.కృతిశెట్టికి తెలుగులో ఎక్కువగా సినిమా ఆఫర్లు అయితే రావడం లేదు.శ్రీలీల కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతుండగా కృతిశెట్టి మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
కృతిశెట్టికి తాజాగా కస్టడీ సినిమాతో భారీ షాక్ తగిలిందనే సంగతి తెలిసిందే.వరుస పరాజయాల వల్ల కృతిశెట్టి ఐరన్ లెగ్ అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.