భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ.మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
తొలి సినిమాలోనే మహేష్ లాంటి స్టార్ హీరోతో నటించే ఛాన్స్ రావడం భరత్ అనే నేను సక్సెస్ సాధించడంతో కియారా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందని అందరూ భావించారు
అందం, అభినయం పుష్కలంగా ఉన్న నటి కావడంతో కియారా ఇతర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తుందని అనుకున్నారు.అయితే కియారా రామ్ చరణ్ తో కలిసి నటించిన వినయ విధేయ రామ బాక్సాఫీస్ దగ్గర ఘోర ఫలితాన్ని అందుకోవడంతో కియారాకు మళ్లీ ఛాన్స్ రాలేదు.
కియారా ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటిస్తోంది.తాజాగా ఒక ఇంటర్వ్యూకు హాజరైన కియారా తన గురించి ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు
ఎవరైనా తనను పొగిడినా, ప్రశంసించినా తనకు ఎంతో సంతోషంగా ఉంటుందని.
ప్రశంసల ద్వారా మరింత ఉత్సాహంగా పనులను చేసే అవకాశం కలుగుతుందని కియారా అన్నారు.బాధ పడేంత విమర్శలు అయితే ఎదురు కాలేదని చిన్నచిన్న విమర్శలను తాను పెద్దగా పట్టించుకోనని కియారా తెలిపారు.
అయితే కొన్ని సందర్భాల్లో చివరి నిమిషాల్లో నిర్ణయాలు మార్చుకుంటానని అదే తనలోని మైనస్ అని అన్నారు
కియారా తన జీవిత భాగస్వామి గురించి చెబుతూ నిజాయితీగా, ముక్కుసూటిగా మాట్లాడేవాళ్లను తాను ఇష్టపడతానని.ఎప్పుడూ సంతోషంగా సరదాగా ఉంటూ ఇతరులలో తప్పొప్పులను సమానంగా స్వీకరిస్తూ, ఇతరులను గౌరవించే వ్యక్తి జీవితంలోకి రావాలని కోరుకుంటున్నానని చెప్పారు.
మరి కియారా అద్వానీ కోరుకున్న లక్షణాలు ఉన్న వ్యక్తి ఆమెకు దొరుకుతాడో లేదో చూడాలి.