దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరొకసారి పెరుగుతున్నాయి.రోజు రోజుకీ కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది.
కరోనా మహమ్మారి వల్ల ఇప్పటికే పలు ప్రదేశాలలో లాక్ డౌన్ ని కూడా విధించారు.ఇక కరోనా వైరస్ ఎక్కువగా సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది.
టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ సినీ పరిశ్రమలలో కూడా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది.ఇప్పటికే ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు, హీరోలు, పలువురు ప్రముఖులు కరోనా వైరస్ బారిన పడ్డారు.
టాలీవుడ్ లో మహేష్ బాబు, మంచు లక్ష్మి, మంచు మనోజ్, నటుడు రాజేంద్రప్రసాద్ లకు కరోనా మహమ్మారి సోకినట్లు నిర్ధారణ అయింది.
అలాగే తమిళ స్టార్ హీరో అయినా కమలహాసన్ కు ఇటీవలే అమెరికా వెళ్లి వచ్చిన తర్వాత కరోనా పాజిటివ్ వచ్చింది.
తాజాగా సీనియర్ నటి శోభన కూడా కరోనా బారిన పడింది.ఆమెకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ప్రకటించింది.
అలాగే తాజాగా మరొక సీనియర్ నటి కూడా కరోనా సోకింది.ఆమె ఎవరో కాదు ప్రముఖ నటి, తమిళ బీజేపీ నాయకురాలు అయిన ఖుష్బూ.
ఖుష్బూకి కరోనా పాజిటివ్ పరీక్షించినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.ఈ సందర్భంగా ఖుష్బూ ట్వీట్ చేస్తూ.
మొత్తానికి కరోనా వచ్చేసింది.
రెండు వేవ్ ల నుంచి తప్పించుకున్నప్పటికీ ఈసారి కరోనా నన్ను చేరుకుంది.నిన్న సాయంత్రం వరకు ఎలాంటి లక్షణాలు లేని నాకు ఆ తర్వాత ముక్కు కారడం మొదలైంది.అది కాస్త ఎక్కువ అవ్వడంతో టెస్ట్ చేయించుకున్నాను.
అప్పుడు నాకు పాజిటివ్ అని నిర్ధారణ అయింది.ప్రస్తుతం నేను ఐసోలేషన్ లో ఉన్నాను.
ఒంటరిగా ఉండటం చాలా కష్టంగా ఉంది.కానీ తప్పదు.
కాబట్టి రాబోయే ఐదు రోజులు నన్ను ఎంటర్టైన్ చేయండి.అలాగే ఎలాంటి లక్షణాలు ఉన్నా పరీక్షించుకోండి అంటూ ఖుష్బూ ఫన్నీ గా ట్వీట్ చేసింది.