తెలుగు సినీ నటి.టీడీపీ మహిళా నేత కవిత కూడా ఎమ్మెల్సీ రేసులో ముందున్నట్టు తెలుస్తోంది.
టీడీపీ ఆవిర్భావం నుంచి తాను సీనియర్ ఎన్టీఆర్తో కలిసి పార్టీ కోసం శ్రమించానని, పార్టీ పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అన్నీ తానై పార్టీకి ఎంతో సేవ చేశానని, అయితే, ప్రస్తుతం ఏపీ విభజన తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చినా తనను పక్కన పెట్టారని పదే పదే ఇటీవల మీడియా ముందు తీవ్రంగా ఫీలైపోయిన నటి కవితకి ఇప్పుడు ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది.వాస్తవానికి ఆరేడు నెలల కిందట కవిత హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.
చంద్రబాబుపై సునిసితంగా విమర్శలు ఎక్కుపెట్టారు.
తనకు ఎలాంటి గుర్తింపూ లేకుండా పోయిందని, తాను ఎంతగానో పార్టీ కోసం కృషి చేశానని అయినా కూడా తనకు ఎలాంటి గుర్తింపూ లభించలేదని కవిత ఆరోపించారు.
ఓ రకంగా బాబు తనను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఇప్పుడు కవిత పేరును ఎమ్మెల్సీ సీటుకి పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే ఏపీలో ఎమ్మెల్సీ ఆశవహుల సంఖ్య భారీ ఎత్తున పెరిగిపోయింది.ఏళ్ల తరబడి పార్టీకి సేవ చేసిన వాళ్లు సహా ఇటీవల జగన్ పార్టీ నుంచి వచ్చి చేరిన వారి సంఖ్య పెరిగిపోయింది.
ఈ నేపథ్యంలో ఎవరికి టికెట్ ఇవ్వాలనే అంశంపై చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు.
ఈ క్రమంలోనే ఆయన ఎప్పటి నుంచో పార్టీలో ఉంటూ ఎలాంటి పదవీ లేకుండా సేవ చేస్తున్నవారికి ఇప్పుడు ఛాన్స్ ఇవ్వాలనిడిసైడ్ అయ్యారని తెలుస్తోంది.2019లో ఎట్టిపరిస్థితిలోనూ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని డిసైడ్ అయిన చంద్రబాబు.ఆదిశగా చర్యలు చేపట్టారు.
ఈ నేపథ్యలోనే అసంతృప్త సీనియర్లను బుజ్జగించేందుకు కొందరినైనా ఎమ్మెల్సీలుగా చేయాలని భావిస్తున్నారట.ఈ వరుసలో నే నటి కవిత ఉన్నట్టు తెలుస్తోంది.
ఎప్పటి నుంచో ఎలాంటి పదవీ లేకుండా సేవ చేస్తున్న ఈమెకు ఎమ్మెల్సీగా సీటు ఇవ్వడం ద్వారా సంతృప్తి పరచాలని డిసైడ్ అయ్యారట.