హిందీ నటి కామ్యా పంజాబీ తాజాగా ఓ వింత అనుభవాన్ని ఎదుర్కొంది.పానీ పూరీ స్టాల్లో ఇటీవల రూ లక్ష నగదున్న ఎనవలప్ను మరిచిపోయానని నటి కామ్యా పంజాబీ గుర్తుచేసుకున్నారు.
ఈ మధ్య ఇండోర్ వెళ్లిన తాను అక్కడి పానీ పూరీ స్టాల్లో భారీ నగదుతో కూడిన ఎనవలప్ను మరిచిపోయానని అయితే అదృష్టవశాత్తూ అది తిరిగి తనకు దక్కిందని ఆమె చెప్పుకొచ్చారు.
వివరాల్లోకి వెళ్తే.
ఇటీవల ఓ ఈవెంట్ కోసం మధ్యప్రదేశ్ లోని ఇండోర్ వెళ్ళింది కామ్యా.అక్కడ ఉన్న ఓ ఏరియాలో పానీపూరి చాలా స్పెషల్ అని తెలుసుకున్న కామ్యా.
పానీ పూరి తినేందుకు అక్కడికి వెళ్ళింది.పానీ పూరీలు తింటూ తన దగ్గర ఉన్న లక్ష రూపాయలు ఉన్న ఎనవలప్ను పక్కనున్న టేబుల్పై పెట్టారు.
ఆపై అక్కడి ఫోటోలు తీయడంలో బిజీ అయ్యి.తిరిగివస్తూ ఎనవలప్ను అక్కడే మర్చిపోయి వచ్చేసింది.
అయితే ఆమె తిరిగి హోటల్కు చేరుకున్నాక తన దగ్గర ఉండాల్సిన లక్ష రూపాయల బ్యాగ్ కనిపించడం లేదని ఒత్తిడికి లోనయ్యానని… ఎనవలప్ను తీసుకురావాలని తన మేనేజర్ను అక్కడికి పంపానని ఆమె తెలిపారు.
అయితే ఊహించని విధంగా ఆ లక్ష రుపాయల బ్యాగ్ అక్కడే ఉందట.ఆ విషయం తన మేనేజర్ చెప్పడంతో ఆశ్చర్యపోయిందట కామ్యా.పోయిందనుకున్న సొమ్ము తిరిగి దొరకడంతో చాలా సంతోష పడిందట.
దీంతో ఇండోర్ ప్రజలు చాలా మంచివారు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది కామ్యా పంజాబీ.కేవలం పానీ పూరి వల్ల లక్ష రూపాయలు చేజారిపోయేవి అంటూ ఆమె పెట్టిన సందేశం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దీనిపై పలు రకాల కామెడీ మీమ్స్ పెట్టారు నెటిజన్లు.ఏదేమైనా పోయిన లక్ష దొరకడం, అది కూడా పోగొట్టుకున్న రెండు గంటల తర్వాత అనేది నిజంగా ఆమె అదృష్టమనే చెప్పుకోవాలి.